Nithya Menon : అంత ఈజీ అయితే వాళ్ళే సినిమాలు తీయొచ్చుగా.. సినిమా రివ్యూలు ఇచ్చేవాళ్లపై నిత్యామీనన్ ఫైర్..

తాజాగా హీరోయిన్ నిత్యామీనన్ ఈ సినిమా రివ్యూలు ఇచ్చేవారిపై ఫైర్ అయింది. ఇటీవల ధనుష్ తో కలిసి తిరు అనే ఓ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది నిత్యామీనన్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఓ ఫీల్ గుడ్ మూవీలా అందర్నీ అలరించింది. అయితే ఈ సినిమాపై కొన్ని...............

Nithya Menon : అంత ఈజీ అయితే వాళ్ళే సినిమాలు తీయొచ్చుగా.. సినిమా రివ్యూలు ఇచ్చేవాళ్లపై నిత్యామీనన్ ఫైర్..

Nithya Menon fires on those who give reviews on movies

Updated On : September 5, 2022 / 7:51 AM IST

Nithya Menon :  ఇటీవల సినిమాల ఫలితం మొదటి ఆటతోనే తేలిపోతుంది. ఒకప్పుడు సినిమా ఫ్లాప్ అయినా కొన్ని రోజుల వరకు కలెక్షన్స్ వచ్చేవి, జనాలు వెళ్లేవారు. కానీ ఇప్పుడు మార్నింగ్ షో పడగానే సినిమా పరిస్థితి తెలిసిపోతుంది. బాగుంది అంటేనే సినిమాకి వెళ్తున్నారు, కలెక్షన్లు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం రివ్యూలు. చాలా మంది సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటలకే రివ్యూలు అని పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఒక సినిమా రిలీజ్ అవ్వగానే దాన్ని చూసేసి వారి సొంత అభిప్రాయాన్ని ప్రింట్, వెబ్, సోషల్ మీడియా, యూట్యూబ్.. ఇలా పలు ఫార్మెట్స్ లో రివ్యూ పేరుతో సినిమా గురించి చెప్తారు. కొంతమంది సినిమా కథ గురించి కూడా చెప్పేస్తున్నారు. మరి కొంతమంది సినిమా ఇలా తీస్తే బాగుండేది, అలా తీస్తే బాగుండేది అంటూ సలహాలు ఇస్తారు. సినిమాలో వాళ్ళకి నచ్చని అంశాల గురించి నెగిటివ్ గా మాట్లాడతారు. ఇన్ని చెప్పినా ఇది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అని మాత్రం చెప్పారు. దీని వల్ల ఒక సినిమా గురించి నెగిటివ్ గానే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. దీంతో సినిమాలకి భారీ నష్టం చేకూరుతుంది. డబ్బుల కోసం, వాళ్ళ పాపులారిటీ కోసం ఇటీవల రివ్యూలు ఇచ్చేవాళ్లు ఎక్కువ అయిపోవడంతో సినిమా పరిశ్రమకి ఇది శాపంలా మారింది. ప్రేక్షకులు కూడా చాలా మంది ఈ రివ్యూలు చూసి సినిమాలకి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఈ సినీ రివ్యూలను ఇప్పటికే చాలా మంది సినిమా వాళ్ళు విమర్శించారు.

Barack Obama : వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు దక్కించుకున్న బరాక్ ఒబామా..

తాజాగా హీరోయిన్ నిత్యామీనన్ ఈ సినిమా రివ్యూలు ఇచ్చేవారిపై ఫైర్ అయింది. ఇటీవల ధనుష్ తో కలిసి తిరు అనే ఓ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది నిత్యామీనన్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఓ ఫీల్ గుడ్ మూవీలా అందర్నీ అలరించింది. అయితే ఈ సినిమాపై కొన్ని నెగిటివ్ రివ్యూలని చుసిన నిత్యామీనన్ తాజాగా ఏర్పాటు చేసిన తిరు సక్సెస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ”ఈ మధ్య కొంతమంది ప్రతీ సినిమాను ఎక్కువగా విశ్లేషిస్తున్నారు. రివ్యూల పేరుతో సినిమా అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే ఇంకా బాగుండేది, కచ్చితంగా ఇలా తీస్తేనే ప్రేక్షకులు చూస్తారు అంటూ వాళ్ళ సొంత అభిప్రాయాలను ప్రజలపై రుద్దుతున్నారు. వాళ్ళ దగ్గర నిజంగానే అంత ట్యాలెంట్ ఉంటే ఇక్కడికి వచ్చి సినిమా తీయొచ్చు కదా. ఒక సినిమా ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధమవుతుంది. వందల అభిప్రాయాలు వస్తాయి. కానీ కొంతమంది సినిమా రివ్యూలతో ప్రజలపై వారి నెగిటివ్ అభిప్రాయాలని వదులుతున్నారు. ఇలాంటివి మారాలి. సినిమా రివ్యూ చెప్పినంత ఈజీ కాదు సినిమా తీయడం”అని ఫైర్ అయింది. ఇప్పటికైనా ఈ రివ్యూలు ఇవ్వడం మానాలి అని సినీ వర్గాలు కోరుకుంటున్నారు.