Palnati Surya Pratap : మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’.. వెబ్ సిరీస్ తో రాబోతున్న కుమారి 21F దర్శకుడు..
జగమే సంగీతం సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. (Palnati Surya Pratap)
Palnati Surya Pratap
Palnati Surya Pratap : గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సుష్మిత కొణిదెల నిర్మాణంలో కుమారి 21F దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ జగమే సంగీతం. ఎనిమిది ఎపిసోడ్ల మ్యూజికల్ డ్రామాగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి.. మెయిన్ లీడ్స్ లో సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి కిరణ్, కేశవ్ దీపక్, ప్రియాంక నల్కరి, మాణిక్ రెడ్డి, ప్రాచీ థాకర్, రూపా లక్ష్మి.. పలువురు కీలక పాత్రలలో నటించారు.
జగమే సంగీతం సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంతో పాటు మిగతా ఆదేశాల్లో కూడా తెలుగు, తమిళ్ భాషల్లో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అందుబాటులోకి రానుంది. కర్ణాటక సంగీత నేపథ్యంలో సాగే మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడారు.
Also Read : Jabardasth Comedian : జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్న మరో కమెడియన్..
పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ.. నా దృష్టిలో కుటుంబం, కుటుంబాన్ని కలిపి ఉంచే భావోద్వేగాలే ఈ కథకు ప్రధానం. ఈ కథలో సంగీతం ఒక భాషగా పనిచేస్తుంది. నాకు కర్ణాటక సంగీతం అంటే ఇష్టం. దానిపై అవగాహన కూడా ఉంది. అందుకే ఆ కథాంశంతో ఈ సిరీస్ ని తెరకెక్కించాను. ఆ సంగీతం కథలో సహజంగా, వాస్తవికంగా ఇమిడిపోయింది. ఇది నా మొదటి వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో సంగీతానికి ప్రాధాన్యం ఇస్తూనే ఆ సంగీతం కథకు సపోర్ట్ అయ్యేలా చూసాను. సంగీతం కథనానికి ఏ మాత్రం ఆటంకం కలిగించదు. కుటుంబ సంబంధాలు, సాంస్కృతిక విశేషాలు, సంగీత ప్రపంచం అన్నీ కలిసి తెలుగు ప్రేక్షకులకు నిజాయితీగా, దగ్గరగా అనిపించేలా ఈ సిరీస్ ని తెరకెక్కించాను అని తెలిపారు.
