Rajasaab : ‘రాజాసాబ్’ పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్.. ప్రభాస్ శ్రీను కామెంట్స్..

'రాజాసాబ్' పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Rajasaab : ‘రాజాసాబ్’ పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్.. ప్రభాస్ శ్రీను కామెంట్స్..

Prabhas Sreenu interesting comments about Rajasaab movie

Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా కొన్నాళ్ళు సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. అయితే ఇటీవలే ఈ మూవీ టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేస్తూ మూవీని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి’ చిత్రీకరణలో బిజీగా ఉండడంతో.. ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది.

కాగా ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కబోతుందంటూ మారుతీ చెప్పుకొచ్చారు. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గట్టు సినిమా ఉంటుందని వెల్లడించారు. తాజాగా ఈ మూవీ గురించి ప్రభాస్ అసిస్టెంట్ మరియు మిత్రుడు శ్రీను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

”రాజాసాబ్ పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ సినిమాలులా ఉండవు. ఎప్పుడు చూడని యాంగిల్స్ ఈ సినిమాలో మీరు చూస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఆడియన్స్ లో మూవీ పై మరిన్ని అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.

Also read : Ram Charan : రామ్‌చరణ్ గురించి పాకిస్తాన్ మీడియాలో చర్చ.. వీడియో వైరల్..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తీ అయ్యింది. ప్రభాస్ కల్కి సెట్స్ నుంచి ఫ్రీ అవ్వగానే ఈ మూవీ బ్యాలన్స్ షూట్ ని కూడా పూర్తి చేసేయనున్నారు.

ఈ సినిమాని హార్రర్ బ్యాక్‌డ్రాప్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మూవీలోని ప్రభాస్ పాత్ర చాలా ఎంటర్టైనింగా ఉంటుందట. ఈ మూవీ నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.