ఆర్. నారాయణ మూర్తిపై నట్టి కుమార్ ఫుల్ ఫైర్.. ఆ రోజు జగన్ చిరంజీవిని అవమానించినప్పుడు…

మీతో మీటింగ్ పెట్టించిన వారు, మీతో మాట్లాడించిన వారు చెప్పలేదా అని అడుగుతున్నా.

ఆర్. నారాయణ మూర్తిపై నట్టి కుమార్ ఫుల్ ఫైర్.. ఆ రోజు జగన్ చిరంజీవిని అవమానించినప్పుడు…

Updated On : May 31, 2025 / 6:18 PM IST

Natti Kumar: థియేటర్ల బంద్, పర్సంటేజీల వ్యవహారంపై ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. ఆర్ నారాయణమూర్తికి నిర్మాత నట్టికుమార్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నారాయణమూర్తి తీరుని ఆయన ఖండించారు. వైసీపీ ప్రభుత్వంలో లేవని గొంతు ఇప్పుడు ఎలా లేచిందని ప్రశ్నల వర్షం కురిపించారు నట్టికుమార్.

”నాడు జగన్ చేసిన అరాచకాల గురించి మీరు మాట్లాడరు. 500 రూపాయల టికెట్ ఉంటే మీరు మాట్లాడరు. నిజమైన ఎగ్జిబ్యూటర్లకు నష్టం జరుగుతుంటే మీరు మాట్లాడరు. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఖండించాల్సిన అవసరం ఏముంది? థియేటర్లు ఎందుకు బంద్ చేస్తున్నారు, మీకు సమాధానం తెలుసా, దానికి మీరు ఆన్సర్ చెప్పారా?

Also Read: పవన్ కల్యాణ్ అలా మాట్లాడటం బాధాకరం.. ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు..

మీతో మీటింగ్ పెట్టించిన వారు, మీతో మాట్లాడించిన వారు చెప్పలేదా అని అడుగుతున్నా. ఆరోజు చిరంజీవి, ఇతర సినీ పెద్దలను అవమానించినప్పుడు, ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు ఒక్కసారైనా మీరు ఖండించారా? ఆరోజు మీరు ఖండించి ఉంటే మీకు హ్యాట్సాఫ్ చెప్పేవాళ్లం. చిరంజీవిని అవమానించడం తప్పు అని ఆరోజు మేము మాట్లాడాం. 5వ షో ఇవ్వలేదని మాట్లాడాం” అని ఆర్ నారాయణమూర్తిపై ఫైర్ అయ్యారు నట్టికుమార్.

పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నారాయణమూర్తి ఏమన్నారంటే..
‘హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుంది. తన చిత్రం హరిహర వీరమల్లు ప్రస్తావన లేకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్‌ కల్యాణ్ పై గౌరవం మరింత పెరిగేది. థియేటర్ల బంద్ అనేది బ్రహ్మాస్తం. సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది’ అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.