Pushpa 2: శేషాచలం నుండి థాయ్లాండ్కు మారిన పుష్ప స్మగ్లింగ్.. నిజమేనా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన విధానం మాస్ వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పుష్ప తొలిభాగం సక్సెస్తో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పుష్ప రాజ్ చేసే ఎర్రచందనం స్మగ్లింగ్ థాయ్లాండ్ వరకు వెళ్తుందని.. దీంతో ఈ సినిమాలో కథ అక్కడ కూడా జరుగుతుందని తెలుస్తోంది.
Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన విధానం మాస్ వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా కావడమే కాకుండా ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులు లభించాయి.
Pushpa 2 : బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలని బీట్ చేసిన పుష్ప 2
పుష్ప తొలిభాగం సక్సెస్తో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఇటీవల చిత్ర యూనిట్ ప్రారంభించగా, ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు బన్నీ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సీక్వెల్ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పుష్ప రాజ్ చేసే ఎర్రచందనం స్మగ్లింగ్ థాయ్లాండ్ వరకు వెళ్తుందని.. దీంతో ఈ సినిమాలో కథ అక్కడ కూడా జరుగుతుందని తెలుస్తోంది.
Pushpa 2: పుష్పరాజ్ షురూ చేశాడు.. సుక్కు షేర్ చేశాడు!
భారత్ సరిహద్దు దాటి థాయ్లాండ్ వరకు పుష్పరాజ్ తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఎదిగిపోతాడని ఈ సినిమాలో మనకు చూపిస్తారట. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. మరి నిజంగానే పుష్పరాజ్ తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని థాయ్లాండ్ వరకు విస్తరిస్తాడా.. ఈ సినిమా కథ థాయ్లాండ్లోనూ జరుగుతుందా అనేది చూడాలి.