Ram Charan : అయోధ్యలో రామ్ చరణ్ క్రేజ్.. ఇది కదా కావాల్సింది.. చరణ్ తండ్రి ఆయన..

మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ అయోధ్యకు నేడు ఉదయం వెళ్లారు.

Ram Charan : అయోధ్యలో రామ్ చరణ్ క్రేజ్.. ఇది కదా కావాల్సింది.. చరణ్ తండ్రి ఆయన..

Ram Charan Craze in Ayodhya Video goes Viral

Ram Charan : దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని రంగాలలోని ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమ నుంచి కూడా చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ అయోధ్యకు నేడు ఉదయం వెళ్లారు.

అయోధ్యలో వీరికి ఘన స్వాగతం లభించింది. మందిరం బయట సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన ప్లేస్ లో చిరంజీవి, చరణ్ కూర్చున్నారు. దేశం నలుమూలల నుంచి ప్రముఖులు అక్కడికి రావడంతో చిరంజీవి, చరణ్ తమకు తెలిసిన వారిని పలకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ చిరంజీవి దగ్గరికి రావడంతో చిరంజీవి, చరణ్.. అనిల్ అంబానీతో కాసేపు ముచ్చటించారు. పలువురు ప్రముఖులు చరణ్ ని పలకరిస్తున్నారు. చరణ్, చిరంజీవితో ఫొటోలు దిగుతున్నారు.

ఈ నేపథ్యంలో లైవ్ అందించే కెమెరామెన్ చరణ్, చిరంజీవిల మీదే ఎక్కువ సేపు ఫోకస్ ఉంచడంతో అక్కడ ఎవరు ఉన్నారని కెమెరామెన్ పక్కన అతను అడగడంతో అక్కడ రామ్ చరణ్ ఉన్నారు, ఆయన తండ్రి కూడా వచ్చారు. అందుకే ఫ్రేమ్ లో చూపిస్తున్నాను అని హిందీలో చెప్పారు. ఈ వాయిస్ వీడియోలో రికార్డ్ అవ్వడంతో దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Hanuman : అయోధ్య రామ మందిరం ప్రారంభం.. హాఫ్ రేట్‌కే హనుమాన్ టికెట్స్ ఎక్కడో తెలుసా?

RRR సినిమాతో రామ్ చరణ్ నార్త్ లో కూడా బాగా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా చరణ్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు ఈ వీడియోలో చిరంజీవి కంటే కూడా చరణ్ ని గుర్తించి చరణ్ తండ్రి అని చెప్పడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇది కదా చరణ్ క్రేజ్ అని, అయోధ్యలో కూడా చరణ్ క్రేజ్ మాములుగా లేదని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.