Ravi Teja: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రవితేజ మధ్య విభేదాలు?
పూరి జగన్నాథ్ తన మూవీ డబుల్ ఇస్మార్ట్ను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఐతే..
గురు శిష్యులైన… డైరెక్టర్ పూరిజగన్నాథ్… మాస్మహారాజ్ రవితేజ మధ్య విభేదాలు తలెత్తాయా? తమ సినిమా రిలీజ్ విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారా? రవితేజకు స్టార్ డమ్ తెచ్చిన దర్శకుడు పూరీ… తాజాగా రవితేజ వైఖరి పట్ల హార్ట్ అయ్యారా? టాలీవుడ్ను ఊపేస్తున్న గురుశిష్యుల గొడవేంటి?
హీరో రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్ మధ్య విభేదాలు తలెత్తినట్లు టాలీవుడ్ టాక్ హాట్టాపిక్గా మారింది. రవితేజను మాస్ మహారాజ్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో అసలు గొడవేంటి అన్న చర్చే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఇద్దరిది గురుశిష్యుల బంధంగా అంతా భావిస్తారు.
అయితే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు సడన్గా ప్రచారం జరుగుతుండటం టాలీవుడ్ను ఊపేస్తోంది. రవితేజ కెరీర్ స్టార్టింగ్లో మంచి హిట్ సినిమాలు తీసి… అగ్ర హీరోగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉండేవి. ఐతే ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్… రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలే వీరి మధ్య విభేదాలకు కారణంగా చెబుతున్నారు.
ఆగస్టు 15న రిలీజ్
పూరి జగన్నాథ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఐతే అదే రోజు రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా రానుండటం ఇద్దరి మధ్య గ్యాప్ తెచ్చిందనే టాక్కు కారణమైందంటున్నారు. లైగర్ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు పూరి జగన్నాథ్.
ఐదేళ్ల కిందట తనకు మంచి హిట్ అందించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ చేశాడు. ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నట్లు చాలా రోజుల కిందటే మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తాజాగా రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీని కూడా అదే రోజు రిలీజ్ చేయాలని నిర్ణయించడం వివాదానికి దారితీసిందంటున్నారు. తెలుగులో సోలో రిలీజ్గా బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావించిన డబుల్ ఇస్మార్ట్ టీమ్కు ఇప్పుడు మిస్టర్ బచ్చన్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుందంటున్నారు..
పూరీ సినిమా వస్తుందని తెలిసి, రవితేజ తన సినిమాను రిలీజ్ చేయడంపై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫీల్ అయినట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై రవితేజకు ఫోన్ చేసి అడిగితే… తనకేమీ తెలియదని… అంతా ప్రొడక్షన్ టీం నిర్ణయమని సింపుల్గా చెప్పేశారట.. గతంలో కొన్ని సినిమాల రిలీజ్ క్లాష్ వచ్చినప్పుడు రవితేజ జోక్యం చేసుకునేవాడని.. కానీ ఇప్పుడు అస్సలు జోక్యం చేసుకోకుండా ఉండటమే టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఇద్దరి మధ్య ఏమైందనే చర్చకు దారితీస్తోంది.
Also Read : SP బాలు తనకు పంపిన చివరి మాటల్ని గుర్తుచేసుకొని.. ఏడ్చేసిన డ్రమ్స్ శివమణి.. తమన్ ఎమోషనల్..