Siddharth : నాకు నంది అవార్డు రాలేదు.. తెలుగులో ఇక సినిమాలు రిలీజ్ చేయను..

సిద్దార్థ్ నటించిన చిన్నా మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో సిద్దార్థ్ మాట్లాడుతూ..

Siddharth : నాకు నంది అవార్డు రాలేదు.. తెలుగులో ఇక సినిమాలు రిలీజ్ చేయను..

Siddharth comments on nandi awards and telugu audience

Siddharth : తమిళ కుర్రాడు అయిన సిద్దార్థ్.. తెలుగు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కొన్నాళ్ళు పాటు ఇక్కడ స్టార్ హీరోగా ఉన్న సిద్దార్థ్‌కి ప్లాప్లు ఎదురవ్వడంతో తెలుగులో ఛాన్సులు తగ్గాయి. దీంతో తమిళనాడుకి వెళ్లిపోయే అక్కడే వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక అక్కడ నటించిన సినిమాలను డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తూ, అడపాదడపా ఇక్కడ సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన తమిళ్ మూవీ ‘చిత్తా’ కూడా తెలుగులో ‘చిన్నా’ పేరుతో రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సిద్దార్థ్ తాజాగా తెలుగులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఇక ఈ ఈవెంట్ లో సిద్దార్థ్ మాట్లాడుతూ.. “నా యాక్టింగ్ లైఫ్ లో నేను నటించిన గొప్ప సినిమా అంటే ఇదే. నేను కె విశ్వనాథ్, మణిరత్నం, కమల్ హాసన్ గారిని గురువులుగా భావిస్తాను. అందుకనే ఈ మూవీని విశ్వనాథ్ గారికి అంకితం చేశాను. ఇక మణిరత్నం, కమల్ హాసన్ గారికి ఈ సినిమాని చూపించాను. కమల్ గారు మూవీ చూశాక.. ఆయన మహానది సినిమా కంటే ఈ సినిమా గొప్పది అంటూ కంప్లీమెంట్ ఇచ్చారు” అని చెప్పుకొచ్చాడు.

Also Read : Jr Ntr : వార్ 2 కంటే ముందే బాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ..! ఏ సినిమాతోనో తెలుసా..?

తను గురువుగా భావించే కమల్ హాసనే.. తన సినిమా గొప్ప అని మాట్లాడడమే తనకి ఎంతో గొప్ప అని చెప్పుకొచ్చాడు. “తెలుగులో నాకు నంది అవార్డు రాలేదు గాని, కమల్ హాసన్ గారు అన్న ఆ మాటే నంది అవార్డు అనిపించింది” అంటూ చెప్పుకొచ్చాడు. అలాంటి సినిమా ఇక్కడ ప్లాప్ అయితే, తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోతే.. ఇక తన సినిమాలను తెలుగులో రిలీజ్ చేయను అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ చిన్నా మూవీ అక్టోబర్ 6న రిలీజ్ కాబోతుంది.