Sree Vishnu : సామజవరగమన కాంబో ఈజ్ బ్యాక్.. ఆల్రెడీ షూటింగ్ సగం పూర్తి.. ఈసారి థ్రిల్లర్‌తో..

సామజవరగమన కాంబో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ మళ్ళీ కలిసి నటించబోతున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకొని..

Sree Vishnu : సామజవరగమన కాంబో ఈజ్ బ్యాక్.. ఆల్రెడీ షూటింగ్ సగం పూర్తి.. ఈసారి థ్రిల్లర్‌తో..

Sree Vishnu Reba Monica John is pairing up again in investigative thriller story

Sree Vishnu : టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్ గా ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుని అందుకున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో హిట్ అందుకొని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో ‘స్వాగ్’ అనే ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే అల్లు అరవింద్ నిర్మాణంలో ఓ సినిమాకి సైన్ చేసారు.

తాజాగా శ్రీవిష్ణుకి సంబంధించిన మరో సినిమా అప్డేట్ వచ్చింది. కొత్త దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తో ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని చేస్తున్నారట. ఈ దర్శకుడు సుకుమార్ శిష్యుడని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రెబా మోనికా జాన్ నటిస్తున్నారట. గతంలో వీరిద్దరూ కలిసి సామజవరగమనలో నటించి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చి హిట్ పెయిర్ అనిపించుకోవాలని చూస్తున్నారు.

Also read : Sai Pallavi : కాలేజీ ఫెస్ట్‌లో అల్లు అర్జున్ పాటకి సాయి పల్లవి డాన్స్.. రింగ రింగ వీడియో చూశారా..

కాగా ఈ మూవీ షూటింగ్ సైలెంట్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 60 శాతం పూర్తి చేసేసారట. త్వరలోనే మూవీని ఆడియన్స్ ముందుకు కూడా తీసుకు రానున్నారు. అంటే ఓం భీమ్ బుష్ తరువాత ఈ చిత్రమే రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. కాలభైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఇక స్వాగ్ సినిమా విషయానికి వస్తే.. గతంలో శ్రీవిష్ణుతో రాజ రాజ చోర సినిమా తీసిన హసిత్ గోలి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. రీతు వర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. అలాగే అల్లు అరవింద్ నిర్మాణంలో తన 18వ సినిమాని చేయబోతున్నారు. కార్తీక్ రాజు డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ డ్రామాతో తెరకెక్కనుంది.