Ajith Kumar : హాస్పిటల్‌లో తమిళ్ హీరో అజిత్.. ఫ్యాన్స్ టెన్షన్.. అసలు ఏమైంది..!

హాస్పిటల్‌లో తమిళ్ హీరో అజిత్. కార్డియో-న్యూరో పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చినట్లు వార్తలు. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ పడి..

Ajith Kumar : హాస్పిటల్‌లో తమిళ్ హీరో అజిత్.. ఫ్యాన్స్ టెన్షన్.. అసలు ఏమైంది..!

Tamil Star hero Ajith Kumar is hospitalised news gone viral

Ajith Kumar : తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. రీసెంట్ గా చెన్నై అపోలో ఆసుపత్రిలో కనిపించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో బయటకి రావడంతో.. అజిత్ అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. తమిళ మీడియాలో అజిత్.. కార్డియో-న్యూరో పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక వార్తలు చూసిన అజిత్ అభిమానులు టెన్షన్ పడి.. వెంటనే ఆ హాస్పిటల్ కి పరుగున చేరుకున్నారు.

దీంతో అజిత్ కి ఏమైందనే అనే విషయం గందరగోళంగా మారింది. అయితే అసలు విషయం ఏంటంటే.. అజిత్ జనరల్ చెకప్ కోసమే హాస్పిటల్ కి వెళ్లారట. అజిత్ సన్నిహిత వర్గాలు నుంచి వచ్చిన సమాచారం బట్టి.. ఆయన రెగ్యులర్ చెకప్‌ల కోసమే ఆసుపత్రికి వెళ్లారని, అజిత్‌కు ఏ ఆరోగ్య సమస్యలు లేవని చెప్పుకొచ్చారు. తమిళ ప్రముఖ పిఆర్ మనోబాల కూడా.. అజిత్ క్షేమంగానే ఉన్నారని, అవన్నీ ఫేక్ న్యూస్ అని చెబుతూ ట్వీట్ చేసారు.

Also read : Rajasaab : ‘రాజాసాబ్’ పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్.. ప్రభాస్ శ్రీను కామెంట్స్..

ఇక ఈ క్లారిటీతో అజిత్ ఫ్యాన్స్ కొంత ఊపిరి పిలుచుకున్నారు. కాగా అజిత్ ప్రస్తుతం మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విడ ముయిర్చి’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఫారిన్ లో ఉండబోతుందని సమాచారం. ‘అజర్‌బైజాన్‌’లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నారట. ఈ షూటింగ్ కోసమే అజిత్ ప్రిపేర్ అవుతున్నట్లు, అందుకనే ముందుగానే కొన్ని ఆరోగ్య చెకప్ లు చేయించుకున్నట్లు తెలుస్తుంది.

లైకా ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీ అర్జున్ సర్జా, రేజీనా, ఆరవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.