Tollywood Director : ఫ్రెండ్స్తో బీటెక్ చదుతున్నప్పటి ఫోటో షేర్ చేసిన డైరెక్టర్.. ఎవరో గుర్తుపడతారా?
తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ తాను విజయవాడలో బీటెక్ చదువుతున్నప్పుడు కాలేజీ బయట ఫ్రెండ్స్ తో కూర్చొని దిగిన ఫోటోని షేర్ చేసాడు.
![Tollywood Director : ఫ్రెండ్స్తో బీటెక్ చదుతున్నప్పటి ఫోటో షేర్ చేసిన డైరెక్టర్.. ఎవరో గుర్తుపడతారా? Tollywood Director : ఫ్రెండ్స్తో బీటెక్ చదుతున్నప్పటి ఫోటో షేర్ చేసిన డైరెక్టర్.. ఎవరో గుర్తుపడతారా?](https://10tv.in/wp-content/uploads/2024/08/rgv.jpg)
Tollywood Star Director Shares His old Photo with Friends and says Find him
Tollywood Director : మన సెలబ్రిటీల పాత ఫోటోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ తాను విజయవాడలో బీటెక్ చదువుతున్నప్పుడు కాలేజీ బయట ఫ్రెండ్స్ తో కూర్చొని దిగిన ఫోటోని షేర్ చేసాడు. ఆ ఫోటో షేర్ చేసి.. ఫొటోలో తాను ఎక్కడున్నాడో కనిపెట్టమన్నాడు.
Also Read : Murari Record : ఆన్లైన్ టికెట్ బుకింగ్స్లో కూడా ‘మురారి’ సరికొత్త రికార్డ్.. మహేష్ ఫ్యాన్సా మజాకా..
ఇంతకీ ఆ ఫోటో షేర్ చేసిన డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా వైరల్ అవ్వాల్సింది. ఆర్జీవీ విజయవాడ సిద్దార్థ కాలేజీలో బీటెక్ సివిల్ ఇంజనీర్ చదివిన సంగతి తెలిసిందే. అప్పట్లో కాలేజీ బయట తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోని ఆర్జీవీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసి ఇందులో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టండి అంటూ సవాలు విసిరాడు. ఇంకేముంది ఆయన అభిమానులు, నెటిజన్లు ఆర్జీవీ ఎక్కడ ఉన్నాడో గుర్తుపట్టి కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫోటో చూసి ఆర్జీవిని గుర్తుపట్టేయండి.