Kaliyugam Pattanamlo : ‘కలియుగం పట్టణంలో’ ట్రైలర్ చూశారా..? ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా..

తాజాగా 'కలియుగం పట్టణంలో' ట్రైలర్‌ను విడుదల చేసారు.

Kaliyugam Pattanamlo : ‘కలియుగం పట్టణంలో’ ట్రైలర్ చూశారా..? ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా..

Vishva Karthikeya Aayushi Patell Kaliyugam Pattanamlo Movie Trailer Released

Kaliyugam Pattanamlo : విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా కొత్త దర్శకుడు రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కలియుగం పట్టణంలో’. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు ఈ సినిమాని నిర్మించారు. ‘కలియుగం పట్టణంలో’ సినిమా మార్చి 29న రాబోతోంది.

ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ట్రైలర్ లో.. ఓ అబ్బాయిని చిన్నప్పుడే పిచ్చోడు అని మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తే పెద్దయ్యాక ఎలా మారాడు, అలాగే నల్లమల అడవుల్లో ఏదో జరుగుతుంది అంటూ పోలీసుల ఆపరేషన్ అంటూ చూపించారు. వీటితో పాటు ఓ ప్రేమ కథ కూడా ఉంది. ట్రైలర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కలియుగం పట్టణంలో సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. చివర్లో ‘ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా’ అని హీరో చెప్తే ఇది కలియుగం అని కౌంటర్ చెప్పడం ఆసక్తిగా ఉంది.

Also Read : Manchu Lakshmi : ఏడుస్తూ మంచు లక్ష్మి కాళ్ళ మీద పడ్డ అభిమాని.. వైరల్ అవుతున్న వీడియో..

ఇక ఈ ట్రైలర్ లాంచ్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ సినిమాని చాలా శాతం కడపలో చిత్రీకరించినట్టు తెలిపారు.