భయం..భయం.. భారత్లో 83కి పెరిగిన కరోనా కేసులు
కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు

కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు
కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మన భారత దేశంలోనూ కరోనా కమ్మేస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం(మార్చి 14,2020) నాటికి 83కి చేరింది. ఇప్పటివరకు ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నాటకలో ఓ వృద్ధుడు, ఢిల్లీలో ఓ వృద్ధురాలు మరణించారు.
క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కట్టడి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసివేశారు.
2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో వెలుగుచూసిన కరోనా వైరస్, చైనాని నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. కరోనా మహమ్మారి 145 దేశాలకు విస్తరించింది. చైనాలో కరోనా మరణాలు ఆగడం లేదు. అటు యూరప్ లో కరోనా మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 45వేల 700ల మందికి కరోనా సోకగా వారిలో 5వేల 438 మంది చనిపోయారు.
* ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం
* ప్రపంచవ్యాప్తంగా 5వేల 438కి చేరిన కరోనా మృతుల సంఖ్య
* చైనాలో అత్యధికంగా 3వేల 189మంది మరణం
* ఇటలీలో 1,266 మందిని మింగేసిన కరోనా
* ఇరాన్ లో కరోనా కాటుకు 514 మంది మృతి
* స్పెయిన్ లో 133 మంది, దక్షిణ కొరియాలో 72మంది మృతి
* అమెరికాలో 50మంది మరణం
* భారత్ లో 83కి పెరిగిన కరోనా కేసులు, ఇద్దరు మృతి
Also Read | ప్రేమించి మోసగించాడని ఎన్నికల్లో పోటీకి దిగిన యువతి