ఐఐటీ మద్రాస్ సాయంతో స్టార్టప్ కంపెనీ “వాటర్ ఫ్లై టెక్నాలజీస్” సముద్రంలో నీటిపై ఎగురుతూ అతి వేగంగా ప్రయాణించే విగ్ క్రాఫ్టును అభివృద్ధి చేసింది. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసల జల్లు కురిపించారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీలాగే ఐఐటీ మద్రాస్ స్టార్టప్లకు పెద్ద కేంద్రంగా మారుతోందని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ సంస్థ స్టార్టప్లకు మంచి మద్దతు, వనరులు, కొత్త బిజినెస్, వినూత్న ఆలోచనల విషయంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పుతోందని చెప్పారు.
దాదాపు ప్రతి వారానికి ఓ సారి కొత్త ‘టెక్వెంచర్’ వార్తలు వస్తున్నాయని చెప్పారు. దీన్ని తాను ఇష్టపడడానికి గల కారణాలను కూడా ఆయన చెప్పారు. ఈ విగ్ క్రాఫ్ట్ నదులు, సముద్రాలపై అద్భుతంగా ప్రయాణిస్తుందని, అంతేగాక పడవ/ఓడలాంటి దీని డిజైన్ చాలా బాగుందని అన్నారు. ఈ డిజైన్ ఇటువంటి రంగాన్ని ఏలుతుందని కితాబు ఇచ్చారు.
కాగా, ఈ విగ్ క్రాఫ్టును అభివృద్ధి చేసిన వాటర్ ఫ్లై టెక్నాలజీస్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీని ద్వారా సులభంగా ప్రయాణించడంతో పాటు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ప్రయాణానికి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
విగ్ క్రాఫ్ట్లో కోల్కతా నుంచి చెన్నైకి కేవలం రూ.600తో ప్రయాణించవచ్చు. ఆ రెండు నగరాల మధ్య 1600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ విగ్ కారు సముద్ర ఉపరితలానికి 4 మీటర్ల ఎత్తులో నుంచి ఎగురుతూ దూసుకెళ్లుంది.
IIT Madras promises to rival silicon valley in terms of nurturing startups…!
Almost every week there’s news of a new ‘TechVenture’
What I like about this one is not just the promise of exploitation of our vast waterways, but the fact that the design of the craft is stunning!… https://t.co/UttbRFYQGW
— anand mahindra (@anandmahindra) February 25, 2025