ఏడీఆర్ సర్వే: అరుణాచల్ అసెంబ్లీ పోటీలో నేర చరితులు
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ లో 60 శాసనసభ స్థానాలున్నాయి. ఈ 60 స్థానాలకు ఆయా పార్టీల నుంచి మొత్తం 184 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
Read Also : కేసీఆర్ ఖబడ్దార్.. నోరు అదుపులో పెట్టుకో : చంద్రబాబు
వీరిలో 29 మంది నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ఈ నేరచరితుల్లో 9 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, ఏడుగురు బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి నేరచరిత్ర కలిగిన లిస్ట్ లో ఉన్నారు. మిగతావారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులేనని ఏడీఆర్ వెల్లడించంది. కాగా 2014 ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన వారు 6 శాతం మంది ఉండగా..2019లో ఇప్పుడు అది 16 శాతానికి చేరింది.
Read Also : నేను జగన్లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్లో కలవను