Ayodhya Airport : భారతీయుల అందరి చూపు అయోధ్య వైపే మళ్లింది.. 500 ఏళ్ల నాటి కల నెరవేరిన తరుణంలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి అత్యధిక సంఖ్యలో వీఐపీలు తరలివచ్చారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అనేక మంది దేశ, విదేశాల నుంచి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన 506 మంది ప్రముఖులు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో పాటు మఠాధిపతులు, మత గురువులు, పండితులు అతిథులుగా హాజరయ్యారు. డిసెంబరు 22 (సోమవారం) నాడు జరిగిన రామ మందిర ప్రారంభోత్సవానికి బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, కళాకారులు, క్రీడాకారులు తరలిరావడంతో అయోధ్యలో కొత్తగా ప్రారంభమైన విమానాశ్రయం కిటకిటలాడింది. కేవలం 30 గంటలలోపే (రెండు రోజుల్లోనే) 39 ప్రైవేట్ జెట్లతో అయోధ్య విమానశ్రయం రద్దీగా మారిపోయింది.
Read Also : Ayodhya Ram Mandir : అయోధ్యలో సినీ సెలబ్రిటీలు.. చిరు, పవన్, రజిని, అమితాబ్, చరణ్.. రామయ్య సేవలో..
అత్యధిక సంఖ్యలో వీఐపీ విమానాలు.. భారీగా రద్దీ.. :
ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) బృందం పర్యవేక్షించిన ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. అనేక చార్టర్డ్ విమానాలు అయోధ్య, పరిసర ప్రాంతాలపై 30 నిమిషాల వరకు క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి. స్వీడిష్ ప్లేన్ ట్రాకర్ ఫ్లైట్రాడార్ 24 ప్రకారం.. రామజన్మభూమి ఆలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు ముంబై నుంచి అత్యధిక సంఖ్యలో వీఐపీ (VIP) విమానాలు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
మొత్తం 13 విమానాలు.. ఏయే ప్రాంతాల నుంచంటే? :
13 ముంబై-అయోధ్య ప్రైవేట్ విమానాలలో 6 విమానాలు డిసెంబర్ 21న ల్యాండ్ అయ్యాయి. మిగిలిన 7 విమానాల్లో బాలీవుడ్ బ్యూటీ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వంటి ప్రముఖులను తీసుకుని మరుసటి రోజు వచ్చారు. ఈ 7 విమానాల్లో హైదరాబాద్ రెండో అత్యంత సాధారణ బయలుదేరే ప్రదేశంగా నిలవగా.. దేశ రాజధాని ఢిల్లీ (5), లక్నో (4), జామ్నగర్ (3), లండన్, జోధ్పూర్, భోపాల్, తిరుచ్చి, బెంగళూరు, డెహ్రాడూన్, భువనేశ్వర్ నుంచి ఒక్కొక్కటి ఉన్నాయి. ఇన్కమింగ్ జెట్లలో గల్ఫ్స్ట్రీమ్ (G650ER), డస్సాల్ట్ ఫాల్కన్ (2000LX), ఎంబ్రేయర్ లెగసీ 600, ఎంబ్రేయర్ లీనేజ్ 1000, బీచ్క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ 200, బాంబార్డియర్ మోడల్స్ వంటి అల్ట్రా-లగ్జరీ విమానాలు ఉన్నాయి.
Airport visuals of Megastar #Chiranjeevi Garu and MegaPowerstar #Ramcharan Garu at #Ayodhya #AyodhyaRamMandir #RamMandirPranPrathistha @KChiruTweets @AlwaysRamCharan @onlynikil pic.twitter.com/TLFTisRxb0
— Kollywood Scope – Tamil Cinema (@KollywoodScope) January 22, 2024
రద్దీతో లక్నోలో నిలిచిపోయిన అనేక విమానాలు :
ట్రాకింగ్ డేటా ప్రకారం.. అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్ స్థలానికి అధిక డిమాండ్ ఉన్నందున ఇది ఒకేసారి 8 నారో బాడీ విమానాలను ఆతిథ్యం ఇవ్వగలదు. చాలా వీఐపీ విమానాలు పార్కింగ్ కోసం గోరఖ్పూర్, కాన్పూర్, లక్నో, ఢిల్లీలోని సమీప విమానాశ్రయాలకు వెళ్లవలసి వచ్చింది. అనేక విమానాలు అయోధ్యకు చేరుకోవడానికి ముందుగా లక్నోలో నిలిచిపోయాయి. ఆపై ప్రత్యామ్నాయ పార్కింగ్ గమ్యస్థానానికి బయలుదేరాయి. వీటిలో కనీసం మూడు లగ్జరీ విమానాలు వ్యాపార సంస్థకు చెందినవి కాగా మరికొన్ని ఎయిర్ టాక్సీ ఆపరేటర్ల నుంచి అద్దెకు తీసుకున్నవి ఉన్నాయి.
ఆలయ ప్రారంభోత్సవానికి జెట్లలో పలువురు ప్రముఖులు :
ఈ జెట్లలో ప్రయాణించిన వారిలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్, రామ్ చరణ్, చిరంజీవి, ప్రభాస్, ధనుష్ తదితరులు ఉన్నారు. ఆలయ ప్రారంభోత్సవంలో లెజండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్ క్రికెట్ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని డజను విమానాశ్రయాలను అయోధ్యలో ప్రముఖులను దించిన తర్వాత జెట్లు రాత్రిపూట ఆగిపోయే పార్కింగ్ స్థలాలను ఎంచుకోవాలని కోరింది. నివేదిక ప్రకారం.. అథారిటీ 5 రాష్ట్రాలలో 12 విమానాశ్రయాలను గుర్తించింది. అందులో యుపి, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి.
Bollywood celebs #RanbirKapoor and #AliaBhatt, #RohitShetty, #KatrinaKaif and #VickyKaushal. , #MadhuriDixit and Dr. Sriram Nene and #RajkumarHirani along with arrive at Ayodhya airport for the Pran Pratishtha ceremony of Ram Lalla! #RamMandirPranPrathistha #AyodhyaRamMandir pic.twitter.com/fOjq81YH1g
— Actress Hangama 🔴 (@IndianCelebri) January 22, 2024
ఢిల్లీకి చెందిన వీఆర్ఎస్ వెంచర్స్ లిమిటెడ్ ద్వారా నిర్వహించే (VT-VSS) రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఎంబ్రేయర్ (EMB-135BJ) లెగసీ ఎయిర్క్రాఫ్ట్లో బాలీవుడ్ ప్రముఖుల బృందం ప్రయాణించింది. ఈ బిజినెస్ జెట్లో 14 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. రద్దీని నివారించడానికి ల్యాండింగ్, టేకాఫ్ రెండింటికీ టైట్ స్లాట్లను కేటాయిస్తూ ‘డ్రాప్-అండ్-మూవ్’ విధానాన్ని అవలంబిస్తామని అధికారులు ముందుగానే చెప్పారు.