మూడు రాష్ట్రాల్లో 4ఓట్లు: ప్రకాశ్ రాజ్‌పై ఈసీకి జగన్ ఫిర్యాదు

  • Published By: vamsi ,Published On : March 28, 2019 / 03:09 AM IST
మూడు రాష్ట్రాల్లో 4ఓట్లు: ప్రకాశ్ రాజ్‌పై ఈసీకి జగన్ ఫిర్యాదు

Updated On : March 28, 2019 / 3:09 AM IST

బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌‌పై నాలుగు ఓట్లు ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన జగన్ కుమార్ అనే సామాజిక వేత్త కర్ణాటక ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు.

మూడు రాష్ట్రాల్లో నాలుగు ఓట్లు ప్రకాశ్ రాజ్‌కు ఉన్నాయని, అది చట్టరిత్యా నేరం అని ఇందుకు ఒక్క సంవత్సరం జైలు శిక్ష కూడా వెయ్యచ్చునని సామాజిక వేత్త జగన్ కుమార్ చెబుతున్నారు. ఎన్నికల సంఘం అతని అభ్యర్థిత్వంను కూడా రద్దు చేయాలని జగన్ కుమార్ కోరుతున్నారు.

ప్రకాశ్ రాజ్‌కు బెంగళూరులో ఒక ఓటు.. తమిళనాడులోని వెలచేరిలో రెండు ఓట్లు.. తెలంగాణలోని శేర్‌లింగంపల్లిలో ఒక ఓటు ఉందని, మూడు రాష్ట్రాల్లోనూ ఓట్లు యాక్టీవ్‌గా ఉన్నాయని, ఇది చట్టంలోని సెక్షన్ 17,18 మరియు సెక్షన్ 31లను ఉల్లంఘించడమే అని జగన్ కూమార్ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు.

ప్రకాశ్ రాజ్‌ ఓట్లకు సంబంధించిన కార్డుల కాపీలను కూడా జగన్ కుమార్ తన ఫిర్యాదు లెటర్‌కు జత చేశారు. వెంటనే ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలని జగన్ కుమార్ ఎన్నికల సంఘంను కోరారు.