Congress vs TMC: ఇదేం రాజకీయం.. అటు పొత్తు పెట్టుకుంటూనే ఇటు చిత్తుగా తిట్టుకుంటున్నారు

ఇదొక్కటే కాదు, ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తున్నప్పుడు బెనర్జీ సానుభూతి చూపడం లేదని చౌదరి అన్నారు. ఖోకా బాబు అంటే తన మేనల్లుడు అభిషేక్ విషయానికి వస్తే మాత్రమే బెంగాల్ సీఎం తన బాధను వ్యక్తం చేస్తారంటూ విమర్శించారు

Congress vs TMC: ఇదేం రాజకీయం.. అటు పొత్తు పెట్టుకుంటూనే ఇటు చిత్తుగా తిట్టుకుంటున్నారు

Bengal Politics: కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు చాలా విచిత్రంగా వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు పొత్తులో ఉంటూనే మరొకవైపు అవినీతి ఆరోపణలతో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. లోక్‭సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సందు దొరికినప్పుడల్లా టీఎంసీ మీద మమతా బెనర్జీ మీద విరుచుకుపుడుతూనే ఉంటారు. తాజాగా మరోసారి మమతా బెనర్జీని ఆయన టార్గెట్ చేశారు. తన మేనల్లుడు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతానని చెప్పారని ఆయన అన్నారు. చౌదరి చేసిన ఈ వ్యంగ్య వ్యాఖ్యలతో కూటమిలో చీలిక ఏమైనా వచ్చిందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

INDIA bloc: ఇండియా కూటమిని వదలని ప్రధాని వివాదం.. మరోసారి నితీశ్ పేరు లేవనెత్తిన జేడీయూ

నిజానికి బొగ్గు కుంభకోణం, పశువుల అక్రమ రవాణా కేసులో ఇప్పటికే అభిషేక్ బెనర్జీకి ఈడీ సహా దర్యాప్తు సంస్థలు పలుమార్లు సమన్లు ​​పంపాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు తన మేనల్లుడు అభిషేక్‌ను ఈడీ ద్వారా ఇరికించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఆరోపించారు. అయితే దీనిపై చౌదరి స్పందిస్తూ.. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కేంద్ర ఏజెన్సీలు వేధించినప్పుడు లేదా పిలిపించినప్పుడు మాత్రమే తాను మాట్లాడతానని చెప్పారంటూ విమర్శించారు. టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్‌ను కూడా ఈడీ పిలిపించిందని, అయితే అప్పుడు మమత మాట్లాడలేదని అన్నారు.

Tamilnadu: అంబేద్కర్, దళితుల మీద కులదూషణలు.. వీహెచ్‌పీ మాజీ నేత అరెస్ట్

ఇదొక్కటే కాదు, ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తున్నప్పుడు బెనర్జీ సానుభూతి చూపడం లేదని చౌదరి అన్నారు. ఖోకా బాబు అంటే తన మేనల్లుడు అభిషేక్ విషయానికి వస్తే మాత్రమే బెంగాల్ సీఎం తన బాధను వ్యక్తం చేస్తారంటూ విమర్శించారు. కోట్లాది రూపాయల అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించినట్లు లీప్స్ అండ్ బౌండ్స్ సీఈవోపై ఈడీ ఆరోపించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుజయ్ కృష్ణ భద్రను ఇప్పటికే అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి టీఎంసీ ఎంపీకి కేంద్ర దర్యాప్తు సంస్థ మంగళవారం సమన్లు ​​జారీ చేసింది.