పార్టీలో,ప్రభుత్వంలో పదవులపై సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : August 19, 2020 / 08:54 PM IST
పార్టీలో,ప్రభుత్వంలో పదవులపై సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు

Updated On : August 20, 2020 / 7:18 AM IST

రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో పదవులపై చర్చ సాగుతోంది. పార్టీ​లో లేదా ప్రభుత్వంలో ఎవరు ఎక్కడ పని చేయాలనేది కాంగ్రెస్​ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అన్నారు.



అన్ని సమస్యలకు ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ​ పరిష్కారం కనుగొంటుందనే నమ్మకం ఉందన్నారు. కమిటీ​ ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టినందుకు కాంగ్రెస్​ అధ్యక్షురాలికి నా కృతజ్ఞతలు. కమిటీ తనపని తాను పూర్తి చేస్తుంది. వారు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు ఉంటాయి. ఏ పనైనా.. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంతో జరగాలి. ప్రభుత్వంలో, పార్టీ​లో ఎవరు పని చేయాలనే తుది నిర్ణయాన్ని అధిష్ఠానం తీసుకుంటుంది. అన్ని సమస్యలను కమిటీతో చర్చిస్తాం అని పైలట్ అన్నారు.



మరోవైపు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాజస్థాన్​ వ్యవహారాల ఇంఛార్జిగా కొత్తగా నియమితులైన అజయ్​ మాకెన్​తో సోమవారం భేటీ అయ్యారు పైలట్​. ఈ సందర్భంగా రెబల్​ ఎమ్మెల్యేల సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.