Omicron (1)
Coronavirus Cases Today: ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో భారీగా పెరుగుతున్నాయి. కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో మొత్తం 578కి చేరుకున్నాయి. ఇప్పటివరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఓమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో ఢిల్లీ ఉండగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్లో 49, రాజస్థాన్ 43, తెలంగాణలో 41, తమిళనాడు 34, కర్ణాటకలో 31
ఒమిక్రాన్ కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పటివరకు భారత్లో ఒమిక్రాన్ నుంచి 151 మంది కోలుకున్నారు.
ఒమిక్రాన్ పెరుగుతున్న క్రమంలోనే కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. లేటెస్ట్గా గడిచిన 24గంటల్లో దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు 6 వేల 531 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, 315 మంది చనిపోగా.. 7వేల 141మంది కోలుకున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఇప్పుడు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 75 వేల 841గా ఉంది. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య నాలుగు లక్షల 79 వేల 997కు చేరుకుంది. ఇప్పటివరకు 3 కోట్ల 42 లక్షల 37 వేల 795 మంది కరోనా నుంచి కోలుకున్నారు.