గ్యాంగ్ రేప్ పై కేసు పెట్టిన మరుసటి రోజే..రోడ్డు ప్రమాదంలో బాధితురాలి తండ్రి మృతి

గ్యాంగ్ రేప్ పై కేసు పెట్టిన మరుసటి రోజే..రోడ్డు ప్రమాదంలో బాధితురాలి తండ్రి మృతి

Updated On : March 10, 2021 / 4:09 PM IST

UP Girl’s Father Dies ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు రోజుల క్రితం 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ విషయం తెలిసిందే. అయితే, ఆ సంఘటనపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి ఇవాళ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

బుధవారం(మార్చి-10,2021) అత్యాచారానికి గురైన బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి తీసుకెళ్లారు. బాధితురాలికి వైద్య పరీక్షలు జరుగుతుండగా టీ తాగడానికి తండ్రి బయటకు వచ్చాడు. అప్పుడే ఓ ట్రక్ అతన్ని ఢీకొట్టింది. వెంటనే అతన్ని కాన్పూర్ హాస్పిటల్ కి తరలించామని.. అయితే అప్పటికే అతను మరణించాడని కాన్పూర్ పోలీసు చీఫ్ డాక్ర్ ప్రీతిందర్ తెలిపారు. తాము ప్రమాదం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అయితే, గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు దీపు యాదవ్,సౌరభ్ యాదవ్ తండ్రి కాన్పూర్ కి 100కిలోమీటర్ల దూరంలోని కన్నౌజ్ జిల్లాలో పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు.ఇక,మూడో నిందితుడు గోలు యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, బాలిక కుబుంబసభ్యులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. సామూహిక అత్యాచారంపై తాము కేసు పెట్టినప్పటినుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుక్షణం నుంచి ప్రధాన నిందితుడి అన్న తమను బెదిరిస్తూ వస్తున్నాడని చెప్పారు. తమ తండ్రి పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ అని, జాగ్రత్త అని హెచ్చరించినట్లు తెలిపారు. తన కుమారుడిని చంపేశారని, పోలీసులు పట్టించుకోవడం లేదని మృతుడి తండ్రి బుధవారం ఉదయం మీడియాతో చెప్పారు.