Ghaziabad
Ghaziabad : ఘజియాబాద్ గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొందరు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బైక్ ను ట్రాక్టర్ ఈడ్చుకెళ్లడంతో యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.
Uttar Pradesh: టోల్ చార్జ్ అడిగినందుకు టోల్ ప్లాజా ఉద్యోగిని కారుతో తొక్కి చంపి పరారైన దుండగుడు
ఘజియాబాద్లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో రోడ్డుపై యువకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నారు. అంతలో ఓ ట్రాక్టర్ బైక్ను ఈడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నట్లు కనిపించింది. కొందరు యువకులు ట్రాక్టర్ నడుపుతున్నయువకులపై దాడికి తెగబడ్డారు. ఘజియాబాద్ జిల్లాలోని మురాద్ నగర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సమీపంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఘజియాబాద్ పోలీసులను ట్యాగ్ చేసారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఎటువంటి కేసు నమోదు కాలేదని.. ఇరువర్గాలను శాంతింపచేసి రోడ్డుపై ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
So many things are happening in this video ?pic.twitter.com/aKxa1HSPCZ
— Raja Babu (@GaurangBhardwa1) September 27, 2023
सोशल मीडिया पर एक वीडियो वायरल हो रहा है, जिसमे एक ट्रेक्टर द्वारा एक मोटरसाइकिल को टक्कर मारी गयी है, जाँच में पता चला है कि उक्त घटना क्रम दिनांक 25.09.23 की शाम का थाना मुरादनगर क्षेत्र है |(1/2) @Uppolice pic.twitter.com/tAHquaeigR
— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) September 27, 2023