Uttar Pradesh: టోల్ చార్జ్ అడిగినందుకు టోల్ ప్లాజా ఉద్యోగిని కారుతో తొక్కి చంపి పరారైన దుండగుడు

కారు ఉన్నట్టుండి వెనక్కి తిరిగి వచ్చింది. తన దగ్గరికి వచ్చేంత వరకు కారును శేఖర్ గమనించలేదు. ఒక్కసారిగా చూసి కారు నుంచి తప్పించుకునే లోపే గుద్దేసి మీదకు ఎక్కింది. కొద్ది అడుగులు దూరం అతడిని కారు లాక్కెల్లింది.

Uttar Pradesh: టోల్ చార్జ్ అడిగినందుకు టోల్ ప్లాజా ఉద్యోగిని కారుతో తొక్కి చంపి పరారైన దుండగుడు

Hapur: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. టోల్ ప్లాజా వద్ద టోల్ చార్జీ అడిగినందుకు అక్కడ పని చేస్తున్న ఒక ఉద్యోగిని కారుతో తొక్కించి చంపాడో దుండగుడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రాష్ట్రంలోని ఘజియాబాద్ సమీపంలోని హాపూర్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుందీ ఘటన. కాగా, ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

Kokapet: కోకాపేట్ భూముల వేలంతో సత్తా చాటిన హైదరాబాద్ రియల్ బ్రాండ్.. అక్కడ కూడా పెరగనున్న ధరలు!

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం కారు ఘజియాబాద్ వైపు నుంచి టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. గేట్ నంబర్ 4 గుండా కారు వచ్చింది. అయితే టోల్ చెల్లించకుండా ముందుకు కదిలింది. ఇంతలో అక్కడే పని చేస్తున్న శేఖర్ యాదవ్ అనే ఉద్యోగి.. కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కొద్ది దూరం ఆ కారు వెనకాలే ప్రయత్నించాడు. అయితే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక లాభం లేదని శేఖర్ వెనక్కి వచ్చాడు.

Rahul Gandhi : మళ్లీ ఎంపీగా రాహుల్.. అనర్హత ఎత్తివేసిన లోక్‌సభ

అయితే కారు ఉన్నట్టుండి వెనక్కి తిరిగి వచ్చింది. తన దగ్గరికి వచ్చేంత వరకు కారును శేఖర్ గమనించలేదు. ఒక్కసారిగా చూసి కారు నుంచి తప్పించుకునే లోపే గుద్దేసి మీదకు ఎక్కింది. కొద్ది అడుగులు దూరం అతడిని కారు లాక్కెల్లింది. అనంతరం అక్కడి నుంచి పరారైంది. టోల్ ప్లాజా వద్ద టోల్ కట్టకుండా కారు డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడని, టోల్ వర్కర్ అడ్డుకున్నాడని సీఓ వరుణ్ కుమార్ మిశ్రా చెప్పారు. ఇక కారు అడ్రస్ కనుక్కున్నారట. ఆ డ్రైవర్ కోసం అన్వేషణ కొనసాగుతోందని స్థానిక పోలీసులు తెలిపారు.