మోడీకి ఈసీ క్లీన్ చిట్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని వార్దా సిటీలో ఏప్రిల్-1,2019న వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ పోటీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేదిగా ఉందంటూ ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ నేతలు కంప్లెయింట్ చేసిన విషయం తెలిసిందే.అయితే మోడీ ఎటువంటి కోడ్ ఉల్లంఘనకు పాల్పడలేదంటూ మంగళవారం(ఏప్రిల్-30,2019) ఎలక్షన్ కమిషన్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.

 వార్దాలో ఏప్రిల్-1,2019న ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ హిందువులను అవమానించింది. కాంగ్రెస్ నిర్ణయానికి ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలి. ఆ పార్టీ నేతలు హిందు మెజారిటీ ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి భయపడుతున్నారు. అందుకే మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు సిద్దమయ్యారు అని మోడీ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు