మూడు ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదం

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బైరక్ పూర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం (మే 9,2019) రాత్రి బరక్ పురాలోని బిల్కుండా గ్రామ పంచాయితీలోని ఓ ఫ్యాక్టరీలో చెలరేగాయి. ఆ మంటలు మరో రెండు ఫ్యాక్టరీలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలకు ఆర్పారు. కాగా ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.