ఢిల్లీ : పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబరు)ను ఆధార్ తో అనుసంధానం చేసుకోడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం మరోసారి గడువు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు ఇంతకు ముందు ప్రకటించిన దాని ప్రకారం మార్చి 31తో ముగిసింది. కాని దీన్ని మరో 6 నెలలపాటు పొడిగించారు, అంటే సెప్టెంబరు 30లోపు వినియోగదారులు పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవచ్చు.
ఇకపై ఆదాయపన్ను రిటర్న్ ధాఖలు చేసేవారు తప్పని సరిగా ఆధార్ నెంబరు నుకూడా పొందు పరచాలని సూచించింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 ,2019 నుంచి అమల్లోకి వస్తుంది. ఆధార్ రాజ్యాంగ బద్ధమేనని, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు తప్పని సరిగా ఆధార్ నంబర్ను పొందుపరచాలని గత ఏడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు స్పృష్టం చేసింది.