క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన 51మందిపై కేసులు

  • Published By: vamsi ,Published On : July 5, 2020 / 01:49 PM IST
క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన 51మందిపై కేసులు

Updated On : July 5, 2020 / 2:45 PM IST

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుంటే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ సమయంలో కూడా కొందరు క్రికెట్ మ్యాచ్ నిర్వహిండంతో వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన చోటచేసుకోగా.. మొత్తం 51మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే గ్రౌండ్‌కు రావడానికి వారు ఉపయోగించిన 17 కార్లను సీజ్ చేశారు.

కేసు నమోదైన వారిలో ఢిల్లీకి చెందిన ఇద్దరు నిర్వాహకులు, పలువురు ప్రేక్షకులు ఉన్నారు. నిర్వాహకులను దీపక్ అగర్వాల్, నాజిక్ ఖురానాలుగా గుర్తించారు. ప్రేక్షకుల్లో పలువురు ఢిల్లీ నుంచి వచ్చిన వారని తెలిసింది. ప్రస్తుతం కొవిడ్-19 నిబంధనలు అమల్లో ఉండగా.. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి. అయితే నిర్వాహకులు ఎలాంటి అనుమతులూ లేకుండానే క్రికెట్ మ్యాచ్‌ ఏర్పాటు చేశారు.

అంతేకాదు అక్కడికి వచ్చినవారు కూడా కనీస జాగ్రత్తలు పాటించలేదు. దీంతో ఐపీసీ 188, 269, 270 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు గ్రేటర్ నోయిడా డీసీపీ రాజేశ్ కుమార్ సింగ్ వెల్లడించారు. అయితే 51 మందిని అరెస్టు చేసిన కొన్ని గంటల్లో బెయిల్ మంజూరు చేశారు. ఆ సమయంలో ప్రొఫెషనల్ టోర్నమెంట్‌కు సమానమైన ఆటగాళ్ళు కిట్లు మోసుకెళ్ళి జెర్సీ ధరించి ఉన్నారని అధికారులు తెలిపారు.

నిర్వాహకులు ఒక గుడారం మరియు స్నాక్స్ మరియు రిఫ్రెష్మెంట్ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. డేరాలోని ఒక విభాగంలో ల్యాప్‌టాప్‌లు, మైక్రోఫోన్‌లతో పాటు ప్రకటనల కోసం ఏర్పాటు చేశారు. సామాజిక దూరం లేకుండా ఆటగాళ్ళు మరియు సిబ్బంది ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉన్నారు. పోలీసుల జోక్యం చేసుకోకపోతే ఈ టోర్నమెంట్ ఒక వారం పాటు జరగాల్సి ఉందని స్థానికులు తెలిపారు.