ఫుల్ రిపోర్ట్ : భారత్ లో ఏయే రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు,మరణాలు

భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 1721 మందికి కరోనా సోకగా,48 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 150 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది మరణాలు నమోదయ్యాయి. కేరళలో 241 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతి చెందారు. తమిళనాడులో 124 పాజిటివ్ కేసులు,ఒకరు మృతి చెందారు.

ఢిల్లీలో 121 కేసులు,ఇద్దరు మృతి చెందారు. కర్ణాటకలో 101 పాజిటివ్ కేసులు,ముగ్గురు మరణించారు. ఉత్తరప్రదేశ్ లో 104 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ 93 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో 97 కేసులు నమోదుకాగా, 6మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో 87 కేసులు నమోదు అయ్యాయి. మధ్యప్రదేశ్ 86 కేసులు,నలుగురు మృతి చెందారు. గుజరాత్ లో 82 కేసులు,6 మరణాలు నమోదయ్యాయి. జమ్మూకాశ్మీర్ లో 55 కేసులు,ఇద్దరు మృతి చెందారు. హర్యానాలో 43 కేసులు నమోదయ్యాయి. పంజాబ్ లో 41 కేసులు,నలుగురు మృతి చెందారు.

పశ్చిమ బెంగాల్ 27కేసులు,నలుగురు మృతి చెందారు. బీహార్ 21 కేసులు,ఒకరు మృతి చెందారు. చండిఘడ్ 15,లడక్ 13,అండమాన్ 10,చత్తీస్గఢ్ 9,ఉత్తరాఖండ్ 7,గోవా 5,హిమచల్ 3,ఒడిశా 3,అస్సాం 1,ఝార్ఖండ్ 1,మిజోరాం1,మణిపూర్1,పుదుచ్చేరి 3 కేసులు నమోదు అయ్యాయి.

Also Read | ఢిల్లీ భయం నిజమైంది, ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, సీఎం జగన్ సొంత జిల్లాలో హైఅలర్ట్