చైనాపై గురిపెట్టిన భోఫోర్స్ శతుఘ్నలు, ట్రిగ్గర్‌పై వేలు పెట్టి రెడీగా ఇండియా

  • Publish Date - September 16, 2020 / 07:52 PM IST

India- China standoff in Ladakh: లఢక్ మీద శాతాకాలం గాలులు అప్పుడే వీస్తున్నట్లు అనిపిస్తున్నా,ఇండో-చైనా సరిహద్దుల్లో యుద్ధవిమానాల జోరు పెరిగింది. ప్రస్తుతానికి అంతా ఓకే. అయినా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే.. ఇండియన్ ఆర్మీ వింటర్ ప్రిపరేషన్స్‌ మొదలుపెట్టింది. సరిహద్దులకు భారీగా బలగాలతో పాటు యుద్ధ విమానాలను కూడా తరలించింది.

చైనా నుంచి దాడి ఎదురైతే.. తిప్పికొట్టేందుకు ట్రిగ్గర్‌పై వేలు పెట్టి రెడీగా ఉంది ఇండియా. ఇప్పుడు గనక డ్రాగన్ ఓవరాక్షన్ చేస్తే.. ఖతర్నాక్ కౌంటర్ ఇవ్వాలని డిసైడైంది.



ఇండియాకు అర్థమైపోయింది భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గవని. అందుకే కమ్ముకున్న యుద్ధ మేఘాలమధ్య వార్‌కు రెడీ. యుద్ధం భారత్ మొదలుపెట్టకపోయినా శత్రుదేశం చైనా నుంచి వచ్చే దాడిని వెంటనే తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇండో-చైనా బోర్డర్‌లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుందుడుకు చర్యలకు పాల్పడుతుండటంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. ఎల్ఏసీ వెంట మూమెంట్స్‌ని ఇండియన్ ఆర్మీ స్పీడప్ చేసింది. సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తోంది. కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇప్పటికే ఉన్న వాటిని సర్వీసింగ్ చేసి సిద్ధంగా ఉంచుతోంది. ఈ చర్యలన్నింటితో యుద్ధానికి భారత్ ఎప్పుడైనా సిద్ధమనే సిగ్నల్ పంపుతోంది చైనాకు.



మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న లేహ్ ప్రాంతం.. ఇప్పుడు బిజీ. యుద్ధవిమానాలు, హెలికాప్టర్ల శబ్దాలు.. లేహ్‌లో రీసౌండ్ వస్తున్నాయ్. క్యారియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వస్తున్నాయ్ బలగాలను దింపుతున్నాయ్. సైనికులకు కావాల్సిన ఆయుధ సామాగ్రి, ఆహార అవసరాలు తీర్చే సరుకులను డెలివరీ చేస్తున్నాయ్.

2019 beginning of August, Indian Army in Kashmir increased the numbers in srinagar. Government issued new advice to avoid all travel to Jammu and Kashmir.

సరిహద్దుల్లో చైనా కయ్యానికి కాలుదువ్వితే దీటైన జవాబిచ్చేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధం సరిహద్దుల్లో యుద్ధవిమానాలను మోహరించి.. డ్రాగన్ సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఎల్ఏసీ వెంట యుద్ధ హెలికాప్టర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయ్. డేగ కళ్లతో.. పహారా కాస్తున్నాయ్.



ఈ మధ్యే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిన రాఫెల్ ఫైటర్ జెట్స్ కూడా అంబాలా ఎయిర్ బేస్ నుంచి ఎప్పుడైనా ఎయిర్‌లోకి వచ్చేందుకు సై అంటున్నాయ్. ఇప్పటికే.. సరిహద్దులకు యుద్ధ ట్యాంకులను కూడా తరలించారు.

సరిహద్దుల్లో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దూకుడు పెంచింది. ఇండియన్ ఆర్మీ కూడా వెనక్కి తగ్గొద్దని నిర్ణయించుకుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. అందుకే ఎల్ఏసీ వెంట యుద్ధ సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ యుద్ధమే జరిగితే అందుకు కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని భారత సేనలు సిద్ధం చేసుకుంటున్నాయ్.

తిండి మొదలు, యుద్ధ విమానాలు, ట్యాంకర్లకు కావాల్సిన ఇంధనాన్ని కూడా తరలించేశారు. కార్గో విమానాల్లో భారీగా బలగాలను దింపుతున్నారు. లేహ్ నుంచి ఫార్వార్డ్ పోస్టులకు వారందరినీ తరలిస్తున్నారు.



ఇటీవలే.. ఇండియన్ ఆర్మీ సరిహద్దుల్లోని కొన్ని పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకుంది. అక్కడ అవుట్ పోస్టులు ఏర్పాటు చేసింది. దీనివల్ల పాంగాంగ్ సరస్సుకు సమీపంగా చైనా కదలికలపై భారత్ గురి పెట్టింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చైనా అమర్చిన కెమెరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది.

భారత సైనికుల చర్యతో డ్రాగన్‌కు దిమ్మతిరిగిపోయింది. ఎలాగైనా తిరిగి ఆ పర్వతశిఖరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని విధాలుగా రెడీ అవుతోంది. సరిహద్దుల్లో మళ్లీ డ్రాగన్ కవ్విస్తే ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చేందుకు రెడీ.

ట్రెండింగ్ వార్తలు