Hijack Planes Threaten : విమానాలు హైజాక్ చేస్తా.. పాక్ తీసుకెళ్తానంటూ బెదిరింపు కాల్!

విమానాలు హైజాక్ చేస్తా... పాకిస్తాన్‌కు తీసుకెళ్తానంటూ ఓ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ కలకలం రేపింది. మధ్యప్రదేశ్ లోని భూపాల్, ఇండోర్ విమానాశ్రయాలకు ఈ బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Threaten Call To Hijack Planes : విమానాలు హైజాక్ చేస్తా… పాకిస్తాన్‌కు తీసుకెళ్తానంటూ ఓ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ కలకలం రేపింది. మధ్యప్రదేశ్ లోని భూపాల్, ఇండోర్ విమానాశ్రయాలకు ఈ బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భూపాల్ లోని రాజా బోజ్ విమానాశ్రయానికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఫోన్ బెదిరింపు కాల్ వచ్చిందని భూపాల్ గాంధీనగర్ పోలీసు స్టేషన్ ఇంఛార్జ్ అరుణ్ శర్మ వెల్లడించారు.

విమానశ్రయ అధికారులు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో పోలీసులు అగంతకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. భూపాల్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని షుజాల్ పూర్ టౌన్‌లో బెదిరింపు కాల్ చేసిన 34ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

విమానాశ్రయాలకు ఎందుకు బెదిరింపు కాల్ చేశావంటూ పోలీసులు అతన్ని విచారించారు. విమానాల హైజాక్ ఫోన్ బెదిరింపు కాల్ నేపథ్యంలో భూపాల్ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భూపాల్ నుంచి వెళ్లాల్సిన ముంబైకి చెందిన విమానం పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే టేకాఫ్ అయింది.

ట్రెండింగ్ వార్తలు