Raksha Bandhan Gift: రక్షాబంధన్ కానుక ఇచ్చిన మోదీ ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్‭పై భారీ తగ్గింపు

అయితే, ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

Raksha Bandhan Gift: రక్షాబంధన్ కానుక ఇచ్చిన మోదీ ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్‭పై భారీ తగ్గింపు

Updated On : August 29, 2023 / 4:57 PM IST

LPG Gas Cylinder: ఓనం, రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు భారీ బహుమతి ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్దమైంది. ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ఎల్‭పీజీ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఎల్‭పీజీ సిలిండర్ల ధరలను 200 రూపాయల వరకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

Jammu Kashmir: ఆర్టికల్ 35-ఏ రద్దుతో జమ్మూ కశ్మీరీల ముఖ్యమైన హక్కులు రద్దయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మే 2022లో కూడా, కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో 12 సిలిండర్‌లను రీఫిల్ చేయడంపై ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీని ఇవ్వడం ప్రారంభించింది. దీని పదవీకాలం ఇప్పుడు మార్చి 31, 2024 వరకు పొడిగించారు. ఇదిలావుండగా ఈ పథకం కింద సిలిండర్లు పొందే వారు ఇప్పటికే రూ.900 వెచ్చిస్తున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఉపశమనం కలిగించడానికి ఎల్‭పీజీ సిలిండర్‌పై అదనంగా రూ. 200 సబ్సిడీని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

INDIA Convenor: ఇండియా కూటమికి కాంగ్రెసే నాయకత్వం.. ఇంతకీ కూటమి పగ్గాలు ఎవరికి వెళ్తున్నాయో తెలుసా?

మంగళవారం (ఆగస్టు 29) క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ వినియోగదారులందరికీ గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఓనం, రక్షా బంధన్‌ సందర్భంగా సిలిండర్‌ ధరను రూ.200 తగ్గించాలని నిర్ణయించాం. ఇది ప్రజలందరికీ సంబంధించినది. సోదరీమణులకు ఇది పెద్ద బహుమతి. లక్షలాది మంది సోదరీమణులకు ప్రధాని మోదీ బహుమతి ఇచ్చారు’’ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఉజ్వల గ్యాస్ యోజన కింద 75 లక్షల మంది లబ్దిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేయనున్నారు. పైపులు, స్టవ్, సిలిండర్ ఉచితంగా లభిస్తాయి.

Taliban govt : ఆ పార్కులోకి మహిళలు ప్రవేశించకూడదు, బోటింగ్ చేయకూడదు : తాలిబన్ల మరో హుకుం

ఉజ్వల పథకం కింద ఇప్పటికే 200 సబ్సిడీ ఉండగా, నేటి నుంచి 200 మంది ప్రత్యేక సబ్సిడీ ప్రయోజనం పొందనున్నారు. అంటే ఇప్పుడు ఉజ్వల పథకం కింద వచ్చే వారికి రూ.400 సబ్సిడీ లభిస్తుంది. 33 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. అదే సమయంలో 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నారు. దీనికి రూ.7680 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.