Mukesh Ambani : రిలయన్స్ ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు…ఈ సారి రూ.200 కోట్లు ఇవ్వాలని…

భారతీయ అతి పెద్ద కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి హత్య చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే తాము ముకేశ్ అంబానీని హత్య చేస్తామని ఆగంతకులు బెదిరించడం సర్వసాధారణంగా మారింది....

Mukesh Ambani : రిలయన్స్ ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు…ఈ సారి రూ.200 కోట్లు ఇవ్వాలని…

Mukesh Ambani

Updated On : October 29, 2023 / 7:10 AM IST

Mukesh Ambani : భారతీయ అతి పెద్ద కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి హత్య చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే తాము ముకేశ్ అంబానీని హత్య చేస్తామని ఆగంతకులు బెదిరించడం సర్వసాధారణంగా మారింది. ఇప్పటి వరకు పలుసార్లు ముకేశ్ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. ముకేశ్ అంబానీ నుంచి ఆగంతకుడు రూ. 200 కోట్లు డిమాండ్ చేశాడు.

Also Read : US President Joe Biden : జో బిడెన్ ఇంటి సమీపంలోని నిషేధిత గగనతలంలోకి వచ్చిన పౌరవిమానం…యూఎస్ సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు

మునుపటి బెదిరింపు ఈమెయిల్‌కు స్పందించక పోవడంతో, ఆ మొత్తాన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచినట్లు ముంబయి పోలీసులు చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని శుక్రవారం బెదిరించిన ఈమెయిల్ ఖాతా నుంచి మరో హత్య బెదిరింపు వచ్చింది. ‘‘మీరు మా ఈమెయిల్‌కు ప్రతిస్పందించలేదు. ఇప్పుడు ఆ మొత్తం రూ. 200 కోట్లు, లేకపోతే డెత్ వారెంట్‌పై సంతకం చేస్తాం’’ అని ఈ మెయిల్ లో ఆగంతకుడు హెచ్చరించాడు.

Also Read : Mexico : మెక్సికోలో అకాపుల్కో హరికేన్ విధ్వంసం…39 మంది మృతి

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి ఈ మెయిల్ ద్వారా మరో హత్య బెదిరింపు వచ్చింది. రూ.20 కోట్లు చెల్లించాలని, లేకుంటే చంపేస్తానని ముకేశ్ అంబానీ కంపెనీ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. అంబానీకి హత్య బెదిరింపు ఈమెయిల్ పంపిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తమ వద్ద అత్యుత్తమ షూటర్లు ఉన్నారని, తమకు రూ.20కోట్లు ఇవ్వకుంటే హతమారుస్తామని ఈమెయిల్ లో బెదిరించారు.

Also Read : Mike Pence :అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ సంచలన నిర్ణయం

ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా ముంబయిలోని గామ్‌దేవి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై సెక్షన్‌లు 387, 506(2) కింద కేసు నమోదు చేశారు. ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది బీహార్‌లోని దర్భంగాకు చెందిన వ్యక్తి ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు అరెస్టయ్యాడు.

గతంలో బెదిరించింది ఎవరంటే…

నిరుద్యోగి అయిన నిందితుడిని రాకేష్ కుమార్ మిశ్రాగా గుర్తించారు. ముంబయిలోని సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని, ముఖేష్‌ అంబానీ కుటుంబాన్ని బెదిరించాడు. 2021వ సంవత్సరంలో ముఖేష్ అంబానీ దక్షిణ ముంబయి నివాసం యాంటిలియా వెలుపల 20 పేలుడు జెలటిన్ స్టిక్స్, బెదిరింపు లేఖతో కూడిన స్కార్పియో కారును కనుగొన్నారు.