గంటగంటకు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేసింది. ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా బీజేపీకి సరైన బలం లేదని మిగిలిన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఫడ్నవిస్ను గవర్నర్ అహ్వానించడంపై మూడు పార్టీలు అభ్యంతరం తెలుపుతూ పిటీషన్ వేశాయి.
తమకు 144 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని పిటిషన్లో వెల్లడించాయి పార్టీలు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ను ఆహ్వానించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును కోరాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజీత్ పవార్ ప్రమాణం చేయగా.. వారికి తగిన బలం లేదని, దీనిపై సుప్రీం కోర్టు అత్యవసర విచారణ జరపాలని పార్టీలు కోరుతున్నాయి.