MP Mohammed Faizal : ఎన్సీపీ ఎంపీకి సుప్రీం ఊరట..ఎంపీగా ముహమ్మద్ ఫైజల్ కొనసాగింపు

ఎన్‌సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్ కు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ రాజకీయ నాయకుడు, ఎంపీ మహ్మద్ ఫైజల్‌ను సస్పెండ్ చేయాలనే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది....

MP Mohammed Faizal : ఎన్సీపీ ఎంపీకి సుప్రీం ఊరట..ఎంపీగా ముహమ్మద్ ఫైజల్ కొనసాగింపు

MP Mohammed Faizal

Updated On : October 10, 2023 / 5:49 AM IST

MP Mohammed Faizal : ఎన్‌సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్ కు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ రాజకీయ నాయకుడు, ఎంపీ మహ్మద్ ఫైజల్‌ను సస్పెండ్ చేయాలనే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. పార్లమెంటేరియన్‌గా తన సభ్యత్వాన్ని కొనసాగించడానికి కూడా అనుమతినిచ్చింది. మహ్మద్ ఫైజల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Also Read :Tamil Nadu :బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది మృతి

ఈ ఏడాది అక్టోబరు 3వతేదీ నాటి కేరళ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు రిమాండ్ ఆర్డర్‌లో పిటిషనర్‌కు అనుకూలంగా ఈ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులోకి వచ్చాయని పేర్కొంది. హత్యాయత్నం కేసులో తనపై విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ ఆయన చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు అక్టోబర్ 3న కొట్టివేసింది. మహ్మద్ ఫైజల్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. హత్యాయత్నం కేసులో కేరళ హైకోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించడంతో మహ్మద్ ఫైజల్ లోక్‌సభకు అనర్హుడయ్యారు.

Also Read :Ladakh : లడఖ్‌లో మళ్లీ హిమపాతం…సైనికుడి మృతి, నలుగురు గల్లంతు

ఎన్సీపీ ఎంపీకి లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో హత్యాయత్నానికి పాల్పడిన కేసులో మరో నలుగురితో కలిసి దోషిగా తేలడంతో, అతను పార్లమెంటు దిగువ సభకు అనర్హుడయ్యారు. గతంలో కవరత్తి సెషన్స్ కోర్టు మహ్మద్ ఫైజల్ సహా నలుగురిని దోషులుగా నిర్ధారించింది. ఆ తర్వాత హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు విధించిన శిక్షను సస్పెండ్ చేసిన కేరళ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ లక్షద్వీప్‌లోని యూటీ అడ్మినిస్ట్రేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.