Suresh Raina Amabati Rayudu : వంట మాస్టర్లుగా మారిన ఐపీఎల్ స్టార్ క్రికెటర్లు.. ఏం వండారో చూడండి..

ప్రముఖ క్రికెటర్లు అంబటి రాయుడు, సురేష్ రైనాలు వంట మాస్టర్ల అవతారం ఎత్తారు. ఇద్దరూ కిచెన్ లోకి దూరారు. గరిటెలు పట్టారు. ఆ తర్వాత నోరూరించే బిర్యానీ వండారు.

Suresh Raina Amabati Rayudu Turn Chefs : ప్రముఖ క్రికెటర్లు అంబటి రాయుడు, సురేష్ రైనాలు వంట మాస్టర్ల అవతారం ఎత్తారు. ఇద్దరూ కిచెన్ లోకి దూరారు. గరిటెలు పట్టారు. ఆ తర్వాత నోరూరించే బిర్యానీ వండారు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌ను మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమితో ఆరంభించిన సంగతి తెలిసిందే. తదుపరి మ్యాచ్‌లో గెలుపుతో విజయాలబాట పట్టాలని ధోనీసేన భావిస్తోంది. కాగా, తొలి మ్యాచ్‌ తర్వాత విరామం లభించడంతో ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్‌లో సరదాగా గడిపారు. మైదానంలో పరుగుల వరద పారించే స్టార్‌ బ్యాట్స్‌మెన్లు సురేశ్‌ రైనా, అంబటి రాయుడు జట్టు సభ్యుల కోసం కమ్మని పసందైన వంటకాలు సిద్ధం చేశారు.

హైదరాబాదీ బిర్యానీ వండటంలో స్పెషలిస్ట్‌ అయిన తెలుగు క్రికెటర్ రాయుడు హోటల్‌ కిచెన్‌లో దగ్గరుండి బిర్యానీ తయారు చేశాడు. రైనా కూడా రుచికరమైన బిర్యానీ తయారు చేయడంలో సాయం చేశాడు. వంట అయ్యాక అంతా కలిసి లొట్టలు వేసుకుంటూ ఫుడ్ ఐటెమ్స్ తిన్నారు. వావ్..బిర్యానీ సూపర్.. అంటూ ఆ ఇద్దరికి కితాబిచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోను చెన్నై ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు