Viral Video : గతేడాది జార్ఖండ్లో సందీప్ అనే వ్యక్తి ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లాడిన సంఘటన బాగా వైరల్ అయ్యింది. అలాంటిదే ఇప్పుడు మరో సంఘటన .. అయితే ఇప్పుడు 4 వధువులను ఒకేసారి పెళ్లాడాడు ఓ వరుడు.
Viral Video : కదులుతున్న రైలే వేదిక.. ప్రయాణికులే అతిథులు.. జంట పెళ్లి వీడియో వైరల్
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు జీవితాలతో ముడిపడి ఉంటుంది. అయితే ఓ వీడియో ఇటీవల ఆన్ లైన్లో వైరల్గా మారింది. వీడియోలో సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న నలుగురు యువతులను ఒకేసారి వరుడు పెళ్లాడినట్లు చూపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెడీ మెసేజ్లు పెట్టారు. అంతేకాదు పెళ్లికి అర్ధం మారిపోయేలా వీరి వేడుక కనిపించింది.
@musafir_vj అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో తెల్లటి దుస్తులు ధరించిన వరుడు.. అతని వెనుక సంప్రదాయబద్ధంగా ముస్తాబైన నలుగురు వధువులు ప్రదక్షిణలు చేస్తున్నట్లు కనిపించింది. చివర్లో నలుగురు భర్త పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. వీడియోలో నేహా కక్కర్ రాసిన పెళ్లి పాట ‘తుమ్ జీత్ గయే ఔర్ హమ్ హారే’ అని వినిపించింది. ‘రథసారధి.. నా రథాన్ని రొండపైకి తీసుకెళ్లండి’ అనే ఫన్నీ క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేశారు.
ఇక నెటిజన్లు ఇది ఫేక్ వీడియో అని కొందరు.. రీల్ చేస్తూ ప్రదక్షిణ చేసే డైరెక్షన్ మర్చిపోయారు అని కొందరు హాస్యాస్పదమైన కామెంట్లు పెట్టారు. గతేడాది జార్ఖండ్కి చెందిన సందీప్ అనే వ్యక్తి కుసుమ్, స్వాతికుమారి అనే మహిళలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. దాంతో గ్రామసభ ఇద్దర్నీ పెళ్లాడాలని నిర్ణయించడంతో అతను ఇద్దరిని పెళ్లాడటం అప్పట్లో వైరల్ అయ్యింది.
सारथी मेरे रथ को खाई के तरफ ले चलो…? pic.twitter.com/n9bYlCOtMS
— मुसाफिर ?vk (@musafir_vj) December 7, 2023