JNUలో దాడి చేసింది మావాళ్లే : హిందూ రక్షా దళ్

జేఎన్యూలో ముసుగులు వేసుకుని వచ్చి దాడులు చేసింది మావాళ్లేనంటూ హిందూ రక్షా దళ్కు చెందిన పింకీ చౌదరీ ప్రకటించారు. జేఎన్యూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనీ..సంఘ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలను తాము చూస్తు ఊరుబోమని హెచ్చరించటానికి ఈ దాడులు చేశామని తెలిపారు పింకీ చౌదరి. జేఎన్యూలో జరిగిన దాడికి తాము పూర్తి బాధ్యత వహిస్తామని చౌదరి స్పష్టం చేశారు.
Pinky Chaudhary,Hindu Raksha Dal: JNU is a hotbed of anti-national activities, we can’t tolerate this. We take full responsibility of the attack in JNU and would like to say that they were our workers. #JNUViolence pic.twitter.com/2GkCIOqOFO
— ANI (@ANI) January 7, 2020
ఢిల్లీలోని జేఎన్యూలో ముసుగులు వేసుకుని వచ్చి కనిపించిన విద్యార్ధుల్ని చావబాది..ప్రొఫెసర్లపై కూడా దాడి చేసిన నానా విధ్వంసం సృష్టించిన ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలన సృష్టించింది. ఈ ఘటనపై పలు రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రముఖులు స్పందించారు. ఈ విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు.
అయితే హిందూ రక్షాదళ్ చీఫ్ చేసిన కామెంట్లపై దర్యాప్తు చేపడుతున్నామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ఆరా తీస్తున్నారు. జేఎన్యూలోకి మాస్క్లు వేసుకుని వచ్చి కర్రలు, రాళ్లతో దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీడియో ఫూటేజ్, ఫేస్ రికగ్నిషన్ టెక్నిక్తో వారిని పట్టుకునే ప్రయత్నం జరుగుతున్నది.
ఆదివారం నాడు జరిగిన ఈ విధ్యంసంలో 30మందికి పైగా విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ముసుగు వ్యక్తుల చేతిలో పడకూడదనే భయంతో కొంతమంది విద్యార్ధులు భవనాలపైనుంచి దూకేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్దులకు కాళ్లు విరిగిపోయాయి. భయాందోళనలకు గురైన ఎంతోమంది విద్యార్ధులు క్యాంపస్ విడిచి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
క్యాంపస్ లో జరిగిన ఈ దాడులు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినవారే చేశారని పలువురు కేంద్రమంత్రులు ఆరోపించారు. దేశంలోని యూనివర్శిటీల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలువారు అరాచకాలు సృస్టిస్తున్నారని ఆరోపించారు. జేఎన్ యూలో ఈ దాడులు ఏబీవీపీ వారే చేశారని కొంతమంది విద్యార్ధులు ఆరోపించారు. ఇలా ఎవరికి వారు ఆరోపణలు సంధించుకున్నారు. ఈ క్రమంలో హిందూ రక్షాదళ్ దళం నేత పింకీ చౌదరి ప్రకటనతో దాడులకు పాల్పడింది ఎవరో తేలింది.
జెఎన్యూలో జరిగిన ఈ దాడిలో 30మందకి పైగా విద్యార్ధులు, ప్రొఫెసర్లతో పాటు జేఎన్ యూ స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్యుఎస్యు) అధ్యక్షుడు ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు.