Sudha Reddy : వామ్మో.. 142 కోట్ల నెక్లెస్ ధరించి మెట్ గాలాలో పాల్గొన్న హైదరాబాద్ బిలినియర్.. ఫొటోలు వైరల్..
న్యూయార్క్ లో జరుగుతున్న మెట్ గాలా 2026 కి హైదరాబాద్ బిలియనీర్ సుధా రెడ్డి మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులలో హాజరయ్యారు. అయితే ఆమె ధరించిన నెక్లెస్ అందర్నీ ఆకర్షించింది. ఈ నెక్లెస్ విలువ ఏకంగా 142.8 కోట్లు. ఈ నెక్లెస్ కోసం 18 క్యారెట్ల బంగారం, వజ్రాల వలయం, 40 క్యారెట్ల అస్చెర్-కట్ కొలంబియన్ పచ్చ, టాంజానియాలోని మెరెలాని కొండల నుండి లభించిన 550 క్యారెట్ల ముదురు ఊదా-నీలం రంగు టాంజనైట్ లాకెట్టుని వాడారు. ఈ లాకెట్టును 'మెరెలానీ రాణి' అని పిలుస్తారు. భారీ ఖరీదైన నెక్లెస్ ని ధరించిన సుధారెడ్డి ఫొటోలు వైరల్ గా మారాయి.















Hyderabad Billionaire Sudha Reddy
