21 మందితో.. వైసీపీ మూడో జాబితా విడుదల

మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్.

21 మందితో.. వైసీపీ మూడో జాబితా విడుదల

CM Jagan

Updated On : January 14, 2024 / 5:30 PM IST

YCP Third List : వైసీపీ ఇంఛార్జిల మార్పులు చేర్పులకు సంబంధించి మూడో జాబితా ఎట్టకేలకు విడుదలైంది. 21మందితో (6 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు) థర్డ్ లిస్ట్ ప్రకటించింది వైసీపీ హైకమాండ్. ఇప్పటివరకు 38 స్థానాల్లో ఇంఛార్జిల మార్పులు చేశారు జగన్. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్.

అయితే మొదటి జాబితాలో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించ లేదు. రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు. మూడో లిస్టులో 6 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మొత్తంగా 59 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు పూర్తయ్యాయి.

Also Read : ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం? టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ పద్మనాభం?

ఈసారి అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించారు. మొదటి రెండు లిస్టులతో పోలిస్తే మూడో జాబితాకు సంబంధించి సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. వివాదాస్పదమైన నియోజకవర్గాలు ఉండటంతో ఎక్కువ సమయం తీసుకున్నారని తెలుస్తోంది.

పార్లమెంటు ఇంఛార్జిలు
తిరుపతి.. కోనేటి ఆదిమూలం
కర్నూలు.. గుమ్మనూరు జయరాం
ఏలూరు… కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
శ్రీకాకుళం.. పేరాడ తిలక్
విశాఖపట్నం.. బొత్స ఝాన్సీ లక్ష్మి
విజయవాడ – కేశినేని నాని

అసెంబ్లీ ఇంఛార్జిలు
ఇచ్చాపురం.. పిరియ విజయ
టెక్కలి.. దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి(ఎస్సీ).. కంభం విజయ రాజు
చిత్తూరు.. విజయానంద రెడ్డి
మదనపల్లె.. నిస్సార్ అహ్మద్
రాయదుర్గం.. మెట్టు గోవిందరెడ్డి
దర్శి.. బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతలపట్టు(ఎస్సీ).. మూతిరేవుల సునీల్ కుమార్
కోడుమూరు(ఎస్సీ).. డాక్టర్ సతీశ్
రాజంపేట.. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
గూడూరు(ఎస్సీ).. మేరిగు మురళి
సత్యవేడు(ఎస్సీ).. మద్దిల గురుమూర్తి
పెనమలూరు – జోగి రమేశ్
పెడన – ఉప్పాల రాము
ఆలూరు – బూసినే విరూపాక్షి