పవన్ కళ్యాణ్ వి చిల్లర రాజకీయాలు : మంత్రి అవంతి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పై మంత్రి ఆవంతి తీవ్ర విమర్శలు చేశారు.

  • Publish Date - December 31, 2019 / 02:03 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పై మంత్రి ఆవంతి తీవ్ర విమర్శలు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పై మంత్రి ఆవంతి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి రాజధాని విషయంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

అమరావతి అభివృద్ధి చేస్తే సరిపోతుందా?..ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా? అని ప్రశ్నించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే..అమరావతిలో పెట్టాలని బాబు చెప్పడంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లారని తెలిపారు. పవన్, చంద్రబాబు వైఖరిని అవలంభిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతే ఎద్దేవా చేశారు. 

అసెంబ్లీని మారుస్తానని సీఎం జగన్ చెప్పలేదని మంత్రి ఆవంతి స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేయరని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కోసం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు చేయడం పవన్ తగదని హితవు పలికారు.