Karnataka Politics: గతేడాది మేలో అప్పటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం చేసింది. అయితే ఈ చట్టంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మైనార్టీలను వేధించే సాధనమే మతమార్పిడి వ్యతిరేక చట్టమని ఆయన అన్నారు. ‘‘మన చట్ట ప్రోత్సహాల ద్వారా బలవంతపు మతమార్పిడిని ఆపగలదు. అలాంటప్పుడు కొత్త చట్టం అవసరమేంటీ? మైనార్టీలను బెదిరించడం, వేధించడం కోసమే ఈ చట్టం’’ అని సిద్ధరామయ్య అన్నారు.
మరోవైపు బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులలో ఒకరైన వీడీ సావర్కర్, కేబీ హెడ్గేవార్ల అధ్యాయాలను పాఠశాల చరిత్ర పుస్తకాల నుంచి తొలగించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి హెచ్కే పాటిల్ చెప్పారు. గతేడాది పాఠశాల విద్య సెలబస్లో ఆ రెండు అధ్యాయాలను చేర్చారు. దానితో పాటు పాఠశాల సిలబస్లో బీజేపీ ప్రభుత్వం చేసిన అన్ని మార్పులను కూడా మార్చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో రోజూ చదివే శ్లోకాలతోపాటు రాజ్యాంగ ప్రవేశికను తప్పనిసరిగా చదవాలని మంత్రివర్గం నిర్ణయించిందని పాటిల్ చెప్పారు.
Karnataka: ఆర్ఎస్ఎస్ పాఠాలు తొలగించి అంబేద్కర్ పాఠాలు తిరిగి ప్రవేశపెట్టిన కర్ణాటక ప్రభుత్వం
బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. గత నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తర్వాత.. గత బీజేపీ ప్రభుత్వ విధానాలను సమీక్షించనున్నట్లు కొత్త ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే, వాటిని సరిదిద్దుతామని సిద్ధరామయ్య నాయకత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.