ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమే : గోరంట్ల 

  • Publish Date - April 22, 2019 / 11:12 AM IST

2019 ఎన్నికల్లో టీడీపీ సునామి రాబోతుందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అంచనాలకు మించి సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇమేజ్ తోనే పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని సవాల్ చేశారు. ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. 
Also Read : BJD MLA అభ్యర్థిపై బాంబు దాడి..

ఉభయగోదావరి జిల్లాలో 28 నుంచి 30 సీట్లు టీడీపీవేనని అన్నారు. రెండు జిల్లాల్లో జనసేన ప్రభావం లేదన్నారు. జనసేన కార్యకర్తలు గట్టిగా పని చేయలేదన్నారు. వైసీపీ బెట్టింగ్ రాయుళ్లు మైండ్ గేడ్ ఆడుతున్నారని మండిపడ్డారు. మే 23 న ఫలితాలను చూసి వారి దిమ్మ తిరగడం ఖాయమన్నారు. మోడీ పతనం తథ్యమన్నారు. మళ్లీ దేశానికి ఆయన ప్రధాని అయ్యేదిలేదన్నారు. 18 నుంచి 20 ఎంపీ సీట్లను గెలిచి మోడీకి గుణపాఠం చెబుతామని చెప్పారు.
Also Read : యనమల వర్సెస్ బొత్స: టీడీపీ ఓడిపోతుంది.. అధికారులూ సహకరించకండి

ట్రెండింగ్ వార్తలు