Guru Pushya Yogam: 12 ఏళ్లకోసారి వచ్చే ‘గురు పుష్యమి అమృత యోగం’.. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే.. పరిహారాలు ఇవే!
"గురు పుష్యమి యోగం(Guru Pushya Yogam)" జ్యోతిష్య శాస్త్రంలో దీనిని అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన అమృత ఘడియలుగా భావిస్తారు.
Guru pushya yoga astrological importance benefits of lakshmi puja
- 12 ఏళ్ల అరుదైన యోగం.
- అఖండ ఐశ్వర్య ప్రదాత లక్ష్మి.
- బంగారం కొనుగోలు శుభప్రదం.
Guru Pushya Yogam: గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి రావడాన్ని “గురు పుష్యమి యోగం(Guru Pushya Yogam)” అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన అమృత ఘడియలుగా భావిస్తారు. 2026 జూన్ 18న కర్కాటక రాశిలో చంద్రుడు, ఉచ్చ స్థితిలో గురుడు కలవడం వల్ల 12 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన యోగంగా మారింది. ఈ రోజున లక్ష్మీ-నారాయణుల అనుగ్రహం కోసం చేసే పూజలు, కొనుగోళ్లు అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాయి.
Cough Syrup: 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పనిసరి..
గురు పుష్యమి యోగం – విశిష్టత:
ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు, గురు గ్రహాన్ని ఆరాధించడం వల్ల అపారమైన ధనలాభం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, నూతన కార్యాలయాలు లేదా దుకాణాలు తెరవడానికి, గృహ నిర్మాణం, శంకుస్థాపన వంటి శుభకార్యాలకు ఈ సమయం అత్యంత ఉత్తమమైనదిగా భావిస్తారు.
ఈ రోజు చేయవలసిన పరిహారాలు & దానాలు:
లక్ష్మీ పూజ, మంత్ర పఠనం: లక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించి, విష్ణు సహస్రనామం పఠించాలి. రావిచెట్టుకు నీరు పోసి 9 ప్రదక్షిణలు చేస్తూ “ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీనారాయణాయ నమః” లేదా అందించిన లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
పసుపు కొమ్మ పరిహారం:
ఒక పసుపు కొమ్మను పూజించి, మీ లాకర్ లేదా డబ్బులు దాచే చోట ఉంచితే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.
దానాలు:
ఒక కిలో శనగలు దానం చేయడం వల్ల గురు దోషాలు తొలగుతాయి. వీటితో పాటు పసుపు, కుంకుమ, పాలు, బెల్లం, అరటిపండ్లు, పుస్తకాలు, అన్నదానం చేయడం విశేష ఫలదాయకంగా చెప్తారు. గోవులకు గ్రాసం లేదా ఆహారం తినిపించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి.
వస్త్రధారణ:
ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం.
కొనుగోలు చేయడానికి అత్యంత శుభదాయకమైనది:
గురు పుష్యమి యోగమైన ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి ఆభరణాలు, భూములు లేదా స్థిరాస్తులు, కొత్త వాహనాలు, ఇలెక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడం శుభప్రదం. విద్యార్థులు ఈ రోజున కొత్త పుస్తకాలు కొనుగోలు చేయడం లేదా చదువు ప్రారంభించడం వల్ల గురు అనుగ్రహంతో విద్యాభివృద్ధి కలుగుతుంది.
