MS Dhoni : ధోని ఐపీఎల్ 2025 సీజన్ ఆడతాడా..? ఒక్క ముక్కలో చెప్పేసిన సురేశ్ రైనా
ఐపీఎల్ 2025లో ధోని ఆడతాడా? లేదా? అనే ప్రశ్నకు సీఎస్కే మాజీ ఆటగాడు అయిన సురేశ్ రైనా ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు.
MS Dhoni – Suresh Raina : ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన చెన్నై నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. 8 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింద్ ధోనికి ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2025లో ధోని ఆడతాడా? లేదా? అనే ప్రశ్నకు సీఎస్కే మాజీ ఆటగాడు అయిన సురేశ్ రైనా ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు.
సురేశ్ రైనా, టీమ్ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్లు జియో సినిమాస్లో కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ధోని ఐపీఎల్ 2025 ఆడతాడా? లేదా? అనే ప్రశ్నకు మొదట ఆర్పీ సింగ్ సమాధానం ఇచ్చాడు. ధోనికి ఇది చివరి సీజన్లా అనిపించడం లేదన్నాడు. తరువాత రైనా వైపు చూస్తూ అతడి సమాధానం కోసం వెయిట్ చేయగా.. రైనా ఒక్క ముక్కలో ఆడతాడు అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Kris Srikkanth : ఆర్సీబీ గెలవాలంటే.. 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. కోహ్లి బౌలింగ్
ఐపీఎల్ 2024లో ధోని ఇప్పటి వరకు ఎలా రాణించాడు?
వయసు అనేది ఓ సంఖ్య మాత్రమేనని ధోని నిరూపించాడు. ఈ సీజన్లో ధోని మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. ముఖ్యంగా ముంబైతో మ్యాచ్లో నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు బాది 20 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు స్కోరును 200 దాటించాడు. ఈ మ్యాచ్లో అతడి స్ట్రైక్రేటు 500గా ఉండడం అతడి సామర్థ్యాన్ని తెలుపుతోంది.
కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పటికీ.. గ్రౌండ్లో ధోని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. అద్భుతమైన క్యాచ్లు, రనౌట్లతో పాటు అవసరమైన సందర్భాల్లో కెప్టెన్ రుతురాజ్కు సలహాలు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన ధోని 236 స్ట్రైక్రేటు కలిగి ఉన్నాడు.
RCB vs SRH : సన్రైజర్స్తో బెంగళూరు మ్యాచ్.. బెంచీపై రూ.47 కోట్లు..
Another #TATAIPL season for Thala Dhoni? 🥹#IPLonJioCinema | @ImRaina | @rpsingh | @anantyagi_ pic.twitter.com/eeMUfyryGT
— JioCinema (@JioCinema) April 17, 2024