ENG vs IND: వామ్మో శుభ్‌మ‌న్‌ గిల్ మామూలోడు కాదు.. 23 ఏళ్లు ప‌దిలంగా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ రికార్డు బ‌ద్ద‌లు..

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై టీమ్ఇండియా టెస్టు శుభ్‌మ‌న్ గిల్ రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉన్నాడు.

ENG vs IND: వామ్మో శుభ్‌మ‌న్‌ గిల్ మామూలోడు కాదు.. 23 ఏళ్లు ప‌దిలంగా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ రికార్డు బ‌ద్ద‌లు..

IND vs ENG 3rd Test Gill breaks Dravid 23 year old record

Updated On : July 14, 2025 / 11:32 AM IST

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌ శుభ్‌మ‌న్ గిల్ రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికి కూడా ఓ అరుదైన ఘ‌న‌త సాధించాడు. 9 బంతులు ఆడి ఓ ఫోర్ సాయంతో 6 ప‌రుగులు చేసి బ్రైడాన్ కార్స్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు గిల్‌. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ గ‌డ్డ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

గ‌తంలో ఈ రికార్డు రాహుల్ ద్ర‌విడ్ పేరిట ఉండేది. 23 ఏళ్ల కింద‌ట అంటే.. 2002లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ద్ర‌విడ్ 602 ప‌రుగులు సాధించాడు. కాగా.. ఈ సిరీస్‌లో గిల్ ఇప్ప‌టి వ‌ర‌కు 607 ప‌రుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 593 ప‌రుగుల‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

MLC 2025 : మేజ‌ర్ లీగ్ క్రికెట్ 2025 విజేత‌గా ముంబై.. అద‌ర‌గొట్టిన క్వింట‌న్ డికాక్‌, ట్రెంట్ బౌల్ట్‌..

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

శుభ్‌మ‌న్ గిల్ – 607 * ప‌రుగులు (2025లో)
రాహుల్ ద్ర‌విడ్ – 602 ప‌రుగులు (2002లో)
విరాట్ కోహ్లీ – 593 ప‌రుగులు (2018లో)
సునీల్ గ‌వాస్క‌ర్ – 542 ప‌రుగులు (1979లో)
రాహుల్ ద్ర‌విడ్ – 461 ప‌రుగులు (2011లో)

ఇక లార్డ్స్ టెస్టు మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ మొద‌టి ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత భార‌త్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో స‌రిగ్గా 387 ప‌రుగులే చేసింది. ఆ త‌రువాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త్ ముందు 193 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

ENG vs IND : లార్డ్స్‌లో టీమ్ఇండియా విజ‌య‌వంత‌మైన ల‌క్ష్య ఛేద‌న ఎంతో తెలుసా? వార్నీ ఇప్పుడెలా..

ఈ ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 4 వికెట్ల న‌ష్టానికి 58 ప‌రుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (33) ఉన్నాడు. భార‌త విజ‌యానికి ఆఖ‌రి రోజు 135 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఇంగ్లాండ్ గెలుపుకు మ‌రో 6 వికెట్లు కావాలి.