India vs West Indies: భారత్-వెస్టిండీస్ మధ్య ట్రినిడాడ్లో మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 2 మ్యాచులు గెలిచిన విషయం తెలిసిందే. మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అన్వేశ్ ఖాన్ స్థానంలో ఈ మ్యాచులో ప్రసిద్ధ్ కృష్ణ ఆడుతున్నాడు. రవీంద్ర జడేజా 100 శాతం ఫిట్ నెస్ సాధించలేని కారణంగా ఈ మ్యాచులో ఆడట్లేదని బీసీసీఐ తెలిపింది.
China: మా దేశంపై దాడి చేసేందుకు చైనా ఆర్మీకి 2025లోపు పూర్తి సామర్థ్యం: తైవాన్
భారత జట్టులో శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హూడా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.
వెస్టిండీస్ జట్టులో కే మేయర్స్, ఎస్ హోప్ (వికెట్ కీపర్), కర్తీ, బ్రూక్స్, పూరన్ (కెప్టెన్), బీ కింగ్, హోల్డర్, పాల్, హోసేన్, సీల్స్, వాల్ష్ ఉన్నారు.