IPL Updates: కీలక ప్లేయర్ ను వదులుకున్న కేకేఆర్ జట్టు .. ఢిల్లీ క్యాపిటల్స్ లోనే పృథ్వీ షా

ఐపీఎల్ 2023 వేలంలో శార్థూల్ ను రూ. 10.75 కోట్ల ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. శార్దూల్ ను వదులుకొనేందుకు సిద్ధం కావడం ద్వారా కేకేఆర్ జట్టుకు

IPL Updates: కీలక ప్లేయర్ ను వదులుకున్న కేకేఆర్ జట్టు .. ఢిల్లీ క్యాపిటల్స్ లోనే పృథ్వీ షా

shardul thakur

kolkata Knight Riders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్ లో జరగనుంది. మొత్తం 10 జట్లు ఈ వేలానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు బీసీసీఐ అన్ని ఐపీఎల్ జట్లను వారి సంబంధిత జాబితాలను సమర్పించాలని కోరింది. ఈ క్రమంలో కొందరు ప్లేయర్స్ ను ఆయా జట్ల యాజమాన్యాలు వదులుకుంటున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి వస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు చర్చలుసైతం పూర్తయినట్లు, ముంబై జట్టు రూ. 15కోట్లు అతన్ని కొనుగోలు చేయనుందని తెలుస్తోంది. మరోవైపు కేకేఆర్ జట్టు కీలక ప్లేయర్ ను వదులుకునేందుకు సిద్ధమైంది. శార్దూల్ ను వదులుకుంటున్న కేకేఆర్ జట్టు తెలిపింది.

Mohammed Shami : కారు ప్రమాదం నుంచి వ్యక్తిని కాపాడిన క్రికెటర్ మహ్మద్ షమీ

ఐపీఎల్ 2023 వేలంలో శార్థూల్ ను రూ. 10.75 కోట్ల ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. శార్దూల్ ను వదులుకొనేందుకు సిద్ధం కావడం ద్వారా కేకేఆర్ జట్టుకు రూ. 10.75 కోట్లు ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి. శార్దూల్ క్రికెట్ ప్రపంచ కప్ లో భారత జట్టులో భాగస్వాముడిగా ఉన్నాడు. శార్దూల్ మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అయితే, శార్దూల్ ను ఏజట్టు తీసుకుంటుందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Ravichandran Ashwin : ముంబై జట్టులోకి హార్ధిక్ పాండ్యా? అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. జట్టు ఎలా ఉంటుందో చెప్పేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీపాంటింగ్, టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ పృథ్వీ షా సామర్థ్యాలపై నమ్మకంతో ఉన్నారు. ఈ కారణంగా పృథ్వీ షా గాయపడినప్పటికీ ఢిల్లీ జట్టులోనే కొనసాగనున్నాడు. ఐపీఎల్ 2024 నాటికి జట్టుకు అందుబాటులో ఉంటాడని టీం మేనేజ్ మెంట్ భావిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్, మనీష్ పాండేలను వదులుకున్న విషయం తెలిసిందే.