MI Vs SRH Match : ఐపీఎల్ చరిత్రలోసరికొత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. సిక్స్ లు, ఫోర్లతో ఇరు జట్ల బ్యాటర్లు విరుచుకుపడటంతో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఆ జట్టు బ్యాటర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు సిక్సర్ల మోత మోగించారు. దీంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సన్రైజర్స్ జట్టు 277 పరుగులు చేసింది.
Also Read : IPL 2024 : రోహిత్ శర్మ ఔట్ అవ్వగానే కావ్య పాప సూపర్ డ్యాన్స్.. వీడియోలు వైరల్
సన్రైజర్స్ జట్టులో మయాంక్ మినహా మిగిలిన బ్యాటర్లు పరుగుల వరద పారించారు. మయాంక్ (11) ఔట్ కాగా, అభిషేక్ శర్మ కేవలం 23 బంతుల్లో 63 పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఆ తరువాత హెన్రిచ్ క్లాసెన్, మార్ క్రమ్ లు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. మార్ క్రమ్ 42 నాటౌట్, క్లాసెన్ కేవలం 34 బంతుల్లో 80 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచాడు. ముగ్గురు బ్యాటర్లు అర్ధ సెంచరీలతో ముంబై బౌలర్లపై విరుచుకు పడటంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ జట్టు 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ జట్లు నమోదు చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావటం గమనార్హం.
Also Read : హైదరాబాద్ బోణీ.. ముంబైపై గ్రాండ్ విక్టరీ
Also Read : IPL 2024 : ధోనీ అద్భుత క్యాచ్.. ఒక్కసారిగా హోరెత్తిన స్టేడియం.. సురేశ్ రైనా ఏమన్నాడంటే?
WHAT. A. MATCH! 🔥
Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥
Hyderabad is treated with an epic encounter 🧡💙👏
Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh
— IndianPremierLeague (@IPL) March 27, 2024