T20 world cup : టీ20 వరల్డ్కప్.. నేడు మరో ఆసక్తికర పోరు.. పాక్కు డూ ఆర్ డై.. ఓడితే బయటకే
T20 world cup : సూపర్ -8లో పాకిస్థాన్ ఆడిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఆ జట్టుకు ఒక్క పాయింట్ లభించింది. ఇవాళ ఇంగ్లాండ్ జట్టుతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్ రేసులో ఉంటుంది.
T20 world cup
- టీ20 వరల్డ్కప్లో మరో ఆసక్తికర సమరం
- ఇంగ్లాండ్ జట్టుతో తలపడనున్న పాకిస్థాన్
- పాకిస్థాన్ జట్టుకు డూ ఆర్ డై .. ఓడితే ఇంటికే..
T20 world cup : టీ20 వరల్డ్కప్ 2026 సూపర్-8లో జట్ల మధ్య మ్యాచ్లు రసవత్తరంగా మారుతున్నాయి. ఏ జట్టు గెలుస్తుంది.. ఏ జట్టు సెమీ ఫైనల్కు చేరుతుందని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గ్రూప్-బిలో ఇవాళ కీలక మ్యాచ్ జరగబోతుంది. పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. భారత కాలమానం ప్రకారం.. ఈ మ్యాచ్ రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది.
సూపర్ -8లో పాకిస్థాన్ ఆడిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఆ జట్టుకు ఒక్క పాయింట్ లభించింది. ఇవాళ ఇంగ్లాండ్ జట్టుతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్ రేసులో ఉంటుంది. లేకపోతే సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. దీంతో ఈ మ్యాచ్ లో మెరుగైన రన్రేట్తో గెలిచేందుకు ఆ జట్టు ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.
మరోవైపు ఇంగ్లాండ్ జట్టుకు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. శ్రీలంకపై తొలి సూపర్-8 మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు గ్రూప్-2లో టాప్ ప్లేస్లో ఉంది. నేడు పాకిస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇంగ్లాండ్ – పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకు 30 టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లాండ్ 21, పాకిస్థాన్ తొమ్మిది మ్యాచ్ లలో విజయం సాధించాయి. టీ20 ప్రపంచ కప్ లో ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మూడు మ్యాచ్ లలో కూడా ఇంగ్లాండ్ జట్టుదే పైచేయి. అయితే, ఇవాళ జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడించేందుకు పాకిస్థాన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందో క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
