U19 World Cup 2024
U19 World Cup 2024 Final : అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్ కల చెదిరింది. వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని భారత్ యువ ప్లేయర్ల ఆశపడినప్పటికీ సాధ్యం కాలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం దక్షిణాఫ్రికాలోని బెనోనిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియాపై ఆసీస్ 79 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. తద్వారా నాలుగో సారి అండర్-19 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. భారత్ టైటిల్ వేటలో ఒక అడుగు దూరంలో నిలిచిపోవటానికి పలు ప్రధాన కారణాలు ఉన్నాయి.
U19 World Cup 2024 Final
Also Read : Under-19 World Cup 2024 : అండర్-19 విజేత ఆస్ట్రేలియా.. ఫైనల్ మ్యాచ్లో భారత్ పై ఘన విజయం..
Although our Under-19 boys may have fallen short in the finals against Australia, their journey has left an indelible mark of inspiration.
From triumph to tribulation, each match became a testament to the unwavering spirit, determination, and skill of our team.
The entire squad… pic.twitter.com/CKQ6FygsMC
— Jay Shah (@JayShah) February 11, 2024
భారత్ జట్టు ఓటమి అనంతరం బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు.. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్లో మన అండర్-19 కుర్రాళ్లు ఓడిపోయినప్పటికీ, వారి ప్రయాణం చెరగని స్ఫూర్తిని మిగిల్చింది. విజయం నుండి కష్టాల వరకు, ప్రతి మ్యాచ్ బారత్ జట్టు తిరుగులేని ఆత్మ, సంకల్పం, నైపుణ్యానికి నిదర్శనంగా మారింది. జట్టులోని ప్రతిఒక్క సభ్యునికి, నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుకు జైషా అభినందనలు తెలిపారు.